నితిన్ కోరిక తీరేనా?

నితిన్ ప్రస్తుతం షాలిని ని పెళ్లి చేసుకుని సంసారం జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. మరోపక్క కెరీర్ లో వరస సినిమాలు. ప్రస్తుతం రంగ్ దే సినిమా షూటింగ్ చివరిలో [more]

Update: 2020-08-06 14:13 GMT

నితిన్ ప్రస్తుతం షాలిని ని పెళ్లి చేసుకుని సంసారం జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. మరోపక్క కెరీర్ లో వరస సినిమాలు. ప్రస్తుతం రంగ్ దే సినిమా షూటింగ్ చివరిలో ఉండగా.. బాలీవుడ్ అంధధూన్ రీమేక్ తో పాటుగా చందు మొండేటి తో మరో సినిమా చెయ్యబోతున్నాడు. రంగ్ దే సినిమా తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధధూన్ సినిమాని పట్టాలెక్కించడానికి నితిన్ రేడి అవుతున్నాడు. అయితే అంధధూన్ సినిమా లో హీరోయిన్ గా రాధికా ఆప్టే, బోల్డ్ పాత్రలో టబు నటించారు. ఇప్పుడు తెలుగులో ఈ రెండు కేరెక్టర్స్ కోసం నితిన్ అండ్ బ్యాచ్ హీరోయిన్స్ ని ఎపిక చేసే పనిలో పడింది. అయితే హిందీలో బోల్డ్ పాత్ర చేసిన టబు పాత్రకి తెలుగులో రమ్యకృష్ణ, ఇలియానా, అనసూయ అంటూ చాలా పేర్లు వినిపించాయి.

అలాగే హీరోయిన్ గా రాధికా ఆప్టే కేరెక్టర్ కి పూజ హెగ్డే పేరు వినిపించినా.. ఆమె నో చెప్పిందిగా అనే టాక్ నడుస్తుంది. అయితే తాజాగా టబు పాత్రకి కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార ని నితిన్ అండ్ కో సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. నయనతార అయితే సినిమాకి భీబత్సమైన క్రేజ్ వస్తుంది అని నితిన్ వాళ్ళ భావనట. అందుకే ఎంత పారితోషకం ఇచ్చి అయినా నయనతారని ఒప్పించాలని నితిన్ వాళ్ళు అనుకుంటున్నారట. అయితే నయనతార ఇమేజ్ ఈ బోల్డ్ కేరెక్టర్ కి సెట్ కాదని.. నయనతార కాకుండా మరే స్టార్ హీరోయిన్ అయినా సంప్రదిస్తే బావుంటుంది అని అంటున్నారు కొందరు. మరి అంధధూన్ రీమేక్ కోసం ఆ బోల్డ్ పాత్రకే చివరికి ఏ హీరోయిన్ చేతికి వస్తుందో అక్కని… ఈలోపు అనేక పేర్లు ప్రచారంలోకొస్తున్నాయి.

Tags:    

Similar News