బాగా విశ్రాంతి కోరుకున్న అమ్మడు ...!

Update: 2018-05-05 01:51 GMT

టాలీవుడ్ లో టాప్ హీరోస్ తో వరుస సినిమా ఆఫర్లు అంటే మాటలా. ఒకటి రెండు కాదు దాదాపు నాలుగైదు పైనే అగ్ర హీరోల చిత్రాలకు డేట్స్ ఇచ్చేసింది జిగేల్ రాణి పూజా హెడ్గే. దాంతో ఆ చిత్రాల మొదలు కావడానికి ముందు పూర్తి స్థాయి విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది అమ్మడు. పూజా కు ఇప్పుడు మామూలు మార్కెట్ లేదు. అమ్మడు సిల్వర్ స్క్రీన్ పై కనపడితే చాలు అన్న రీతిలో టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. దాంతో చేతినిండా సినిమాలతో డేట్స్ ఖాళీ లేకుండా దూసుకుపోతుంది పూజా.

ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లతో ...

టాలీవుడ్ సూపర్ స్టార్ లతో కొత్త చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది పూజ. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం చిత్రం లో హీరోయిన్ పాత్రలో వున్న పూజకు ఆ చిత్రం అయినా వెంటనే ఎన్టీఆర్ తో మే లో చిత్రం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత వంశీపైడిపల్లి ప్రభాస్ కాంబినేషన్ చిత్రంలో నటించనుంది. ఇక ఆ తరువాత మహేష్ బాబు కొత్త చిత్రంలో జిగేల్ మనడానికి డేట్స్ ఇచ్చింది. ఇలా వరుస చిత్రాలు ప్రారంభం అయ్యాక విశ్రాంతి అన్న మాటకు నో ఛాన్స్ కనుక ఇప్ప్డుడు గ్యాప్ లో విశ్రాంతి తీసుకుంటుంది. భారీ సంస్థలు అగ్రహీరోల సరసన నటించనున్న పూజా వచ్చే ఏడాది విడుదలయ్యే చిత్రాల్లో దుమ్ము రేపనుంది అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు మరి ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

Similar News