ఉప్పెన బుచ్చిబాబు స్టెప్స్ చూసారా

దర్శకుడు బుచ్చి బాబు.. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి మైత్రి మూవీ మేకర్స్ లోనే సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఉప్పెన సక్సెస్ తొ బుచ్చిబాబు [more]

Update: 2021-06-08 10:45 GMT

దర్శకుడు బుచ్చి బాబు.. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి మైత్రి మూవీ మేకర్స్ లోనే సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఉప్పెన సక్సెస్ తొ బుచ్చిబాబు స్టార్ హీరోలకి దగ్గరయ్యాడు. అందులో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అని బుచ్చిబాబు అధికారికంగా ట్వీట్ చెయ్యడంతో బుచ్చి బాబు రెండో సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని.. ఈలోపు మరే చిన్న సినిమా చేసే ఉద్దేశ్యం బుచ్చిబాబుకి లేదు అనుకున్నారు. కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ కన్నా ముందే మరో మెగా హీరోతో సినిమా చెయ్యాలనుకుంటున్నాడట.
ఉప్పెన సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కి ఉప్పెన సినిమా చూపించి శెభాష్ అనిపించుకున్న బుచ్చిబాబు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాదు.. పుష్ప 2 పార్ట్శ్ తర్వాత అల్లు అర్జున్ కొరటాలతో సినిమా చేస్తాడని అంటున్నా.. కొరటాల – ఎన్టీఆర్ మూవీ పూర్తయ్యేవరకు బన్నీ వెయిట్ చెయ్యాలి. ఈలోపులో బుచ్చిబాబు అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట. అది కూడా మైత్రి వారు ప్రోద్భలంతో అంటున్నారు. ఎన్టీఆర్ తో చెయ్యాలంటే మూడేళ్లు ఆగాలి.. అదే బన్నీ తో కమిట్ అయితే ఒక ఏడాది ఆగితే సరిపోతుంది. ఇది బుచ్చిబాబు ప్లాన్. అందుకే బుచ్చిబాబు మైత్రి మూవీస్ వారు అల్లు అర్జున్ ని ఒప్పించే పనిలో పడ్డారని వినికిడి.

Tags:    

Similar News