బాలీవుడ్ కంగారు పడిన వేళ!!

ప్రస్తుతం కరోనా తాకిడి అన్ని ఏరియాలలో ఒకేలా ఉంది. సెలెబ్రిటీ లేదు పేదవాడు లేదు.. కరొనకు అందరూ సమానమే. అయితే ఇప్పటివరకు సినిమా ఆర్టిస్ట్ ల్లో పెద్దవారెవరూ [more]

Update: 2020-07-12 05:57 GMT

ప్రస్తుతం కరోనా తాకిడి అన్ని ఏరియాలలో ఒకేలా ఉంది. సెలెబ్రిటీ లేదు పేదవాడు లేదు.. కరొనకు అందరూ సమానమే. అయితే ఇప్పటివరకు సినిమా ఆర్టిస్ట్ ల్లో పెద్దవారెవరూ కరోనా బారిన పడిన వారు లేరు. కేవలం సీరియల్ ఆర్టిస్ట్ లకు మాత్రం కరోనా సోకడం.. క్వారంటైన్ కి వెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని భాషలు ఉలిక్కిపడెలా చేసింది కరోనా. కారణం బాలీవడో మెగా స్టార్ బిగ్ బి అమితాబచ్చన్ కి కరోనా పాజిటివ్ గ నిర్ధారణ కావడం, స్వయానా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది ఆని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అమితాబ్ కి పాజిటివ్ అని తెలియగానే బాలీవడో మొత్తం కంగారు పడింది. అయితే అమితాబ్ ముంబై లోని నానావతి హాస్పిటల్ లో కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ అన్ని భాషల నటులు, బిజినెస్ మ్యాన్ లు సోషల్ మీడియా సాక్షిగా ట్వీట్స్ చేస్తున్నారు.

అమితాబచ్చన్ ముంబై లోని ఓ సెలెబ్రిటీ పుట్టిన రోజు పార్టీకి వెళ్లి అక్కడనుండి అమితాబచ్చన్ కరోనా బారిన పడినట్లుగా  తెలుస్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనకూడా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక అమితాబ్ ఇంటిలోని వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోగా అందరికి నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక అమితాబ్ నానావతి హాస్పిటల్ లోని డాక్టర్స్ తనకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారని.. వారు తనని బాగా చూసుకుంటున్నారని.. ఇక పది రోజుల నుండి తనతో కాంట్రక్టు అయినా వారంతా దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోవాలని అమితాబ్ కోరుతున్నారు. బాలీవుడ్ దిగ్గజం ఇలా కరోనా బారిన పడడంతో అందరూ అవాక్కయ్యారు. అందరూ అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News