ట్రైలర్ చెత్తగా ఉంది… అయినా చూస్తున్నారు

బాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు తిగ్మాంషు ధులియా… అజయ్‌ దేవగణ్‌ నటించిన ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గత శుక్రవారం [more]

Update: 2019-03-01 08:35 GMT

బాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు తిగ్మాంషు ధులియా… అజయ్‌ దేవగణ్‌ నటించిన ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి 200 కోట్లు వసూలు చేసి దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రం గురించి ధులియా మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసాడు… ‘‘ప్రేక్షకుల టేస్ట్ రోజురోజుకి మారుతుంది. గతంలో మేము ఏ సినిమా తీసినా అందరు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు కొంతమంది మాత్రమే కొన్ని సినిమాలు చూస్తున్నారు..మిగిలిన వాళ్లు చూడడం లేదు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రేక్షకుల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు దాదా కోండ్కే అనే దర్శకుడు ఉండేవారు. ఆయన సినిమాలన్నీ కేవలం దిగువ తరగతి ప్రేక్షకులకే నచ్చేవి. కొంచం గౌరవనీయ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ ఆయన సినిమాలు చూసేవారు కాదు.’’

ట్రైలర్ చెత్తగా ఉంది..

‘‘కానీ ఇప్పుడు రోజులు మారాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రాన్ని ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ట్రైలర్ చూస్తే చెత్తగా ఉంది. కానీ సినిమాకి కలెక్షన్స్ తెగ వచ్చేస్తున్నాయి. నాకు నచ్చిన సినిమాలను తెరకెక్కించలేక పోతున్నానన్నదే నా బాధ. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తీయాలని నాకు కూడా ఉంటుంది. కానీ హీరో, హీరోయిన్‌, స్నేహితుల పాత్రలు ఉండి తీరాల్సిన పరిస్థితి ఇంకా ఉంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి ఆయన ఎందుకు ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రం పై ఇంత ఫైర్ అయ్యారన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News