బాలీవుడ్ లో మరో పెళ్లి బాజా మోగనుంది

Update: 2018-06-07 09:38 GMT

బాలీవుడ్ లో ప్రస్తుతం సెలెబ్రెటీస్ అంత వరసబెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ చాలా గ్రాండ్ గా బాలీవుడ్ సెలెబ్రెటీస్ మధ్య పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అదే దారిలో మరో హీరోయిన్ నేహా ధూపియా పెళ్లి చేసుకుంది. అయితే ఈ క్రమంలో మరో సెల‌బ్రిటీ పెళ్లికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చ‌క్ర‌వ‌ర్తి కుమారుడు మ‌హ‌క్ష‌య్ చ‌క్ర‌వ‌ర్తి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ మ‌దాల‌స శ‌ర్మతో.. మ‌హ‌క్ష‌య్ చ‌క్ర‌వ‌ర్తి పెళ్లి జరగనుంది. అయితే వీరి పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసింది హీరోయిన్ మ‌దాల‌స. జులై 7న త‌మ పెళ్లి అని స్వ‌యంగా ప్రకటించింది.

ముంబైలో మాత్రం కాదు....

పెళ్లి ఎక్కడ అనేది మాత్రం చెప్పలేదు. కానీ ముంబైలో మాత్రం కచ్చితంగా పెళ్లి ఉండదని.. మాది డెస్టినేష‌న్ వెడ్డింగ్ అని చెప్పింది. కానీ ఆ డెస్టినేష‌న్ మాత్రం వెల్ల‌డించ‌లేదు. మరో వైపు 'కొత్త బంగారు లోకం' తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన శ్వేతాబసు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్లే పెళ్లిళ్లు.

Similar News