లహరి గేమ్ మొదలు పెట్టినట్లే ఉందిగా

బిగ్ బాస్ 5 సీజన్ తొలిరోజు నుంచే వీక్షకుల్లో ఆసక్తి రేపుతుంది. 19 మంది కంటెస్టెంట్లు గెలుపు కోసం పోటీ పడుతున్నట్లే కన్పిస్తుంది. అరుపులు, కేకలు, వార్నింగ్ [more]

Update: 2021-09-08 02:35 GMT

బిగ్ బాస్ 5 సీజన్ తొలిరోజు నుంచే వీక్షకుల్లో ఆసక్తి రేపుతుంది. 19 మంది కంటెస్టెంట్లు గెలుపు కోసం పోటీ పడుతున్నట్లే కన్పిస్తుంది. అరుపులు, కేకలు, వార్నింగ్ లు.. వేడుకోళ్లతో రెండోరోజు బిగ్ బాస్ షో ముగిసింది. అయితే లహరి మొత్తానికి హైలెట్ కావాలని చూస్తున్నట్లుంది. రెండో రోజు అంతా లహరి డామినేట్ చేసిందనే చెప్పాలి. ఆర్జే కాజల్ తో లహరి గొడవ కు దిగింది. కంటెంట్ కోసమే చేస్తున్నావని, తాను దేనికైనా సిద్ధమని లహరి సవాల్ విసిరింది. దీంతో కాజల్ కళ్ల వెంట నీరు తిరిగింది. అలాగే లహరి ఈరోజు ఎపిసోడ్ లో హమీదాతో కూడా గొడవ పడినట్లు అర్థమవుతుంది. ఇక జస్వంత్ కు, యాని మాస్టర్ కు మధ్య కూడా గొడవ జరిగింది. జస్వంత్ సారీ చెప్పడంతో సద్దుమణిగినా యాని మాస్టర్ ఏడుస్తూ బెడ్ ఎక్కడం కన్పించింది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుంచే గొడవలు ప్రారంభమయ్యాయి.

Tags:    

Similar News