నాని దారిలో వారు కూడా?

కరోనా వలన థియేటర్స్ అన్ని మూత పడ్డాయి. ఏకంగా ఐదునెలల నుండి థియేటర్స్ తెరుచుకోలేదు. ఎప్పటికి తెరుచుకుంటాయో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే చాలామంది చిన్ననిర్మాతలు తమ [more]

Update: 2020-08-13 05:26 GMT

కరోనా వలన థియేటర్స్ అన్ని మూత పడ్డాయి. ఏకంగా ఐదునెలల నుండి థియేటర్స్ తెరుచుకోలేదు. ఎప్పటికి తెరుచుకుంటాయో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే చాలామంది చిన్ననిర్మాతలు తమ సినిమాలను ఓటిటీలకి ఇచ్చేసారు. ఇప్పటికే పెంగ్విన్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణ హిస్ లీలా లాంటి సినిమాలు ఓటిటిలో సందడి చెయ్యగా.. మార్చ్ లో విడుదల కావాల్సిన నాని వి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. దానితో పాటుగా నిశ్శబ్దం, ఉప్పెన, రెడ్ లాంటి సినిమాలు కూడా విడుదల అవ్వకుండా ఆగిపోయాయి. అయితే నాని వి కి రామ్ రెడ్ కి, అనుష్క నిశ్శబ్దానికి, వైష్ణవ తేజ్ ఉప్పెనకి ఓటిటీస్ నుండి భారీ ఆఫర్స్ వచ్చాయి. అందులోను వి కి రెడ్ కి భారీ గా ఆఫర్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.

కానీ వి ని అమ్మేది లేదని దిల్ రాజు తేల్చి చెప్పాడు. అయితే తాజాగా వి ని అమెజాన్ ప్రైమ్ వారు 33 కోట్ల భారీ ఆఫర్ కి ఓటిటి రైట్స్ దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5 న వి అమెజాన్ ప్రైమ్ లో కి రాబోతుంది. చాలా బెట్టుగా ఉన్న దిల్ రాజు చివరికి వి ని ఓటిటికి అమ్మేశారని అంటున్నారు. 25 కోట్ల ఖర్చుకీ గాను అమెజాన్ ప్రైమ్ వారు 33 కోట్లు చెల్లించారని అందుకే దిల్ రాజు అమ్మేసాడని అంటున్నారు. ఎలాగూ థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అవ్వవు. అయినా ప్రేక్షకులు రారు. అందుకే నాని – దిల్ రాజులూ ఆ సినిమాని అమ్మేసారు. ఇక నాని దారిలో నిశ్శబ్దం, రెడ్, ఉప్పెన సినిమాలు కూడా నడుస్తాయని అంటున్నారు. ఇప్పటికే అనుష్క నిశ్శబ్దానికి ఓటిటిలో చూస్తే బెటర్ అంటూ ఓ పోల్ సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి నాని మాదిరి అనుష్క, రామ్, వైష్ణవ తేజ్ లు కూడా లొంగి తమ సినిమాలను అమ్మేస్తారో లేదంటే బెట్టు చేస్తారో చూడాలి.

Tags:    

Similar News