కోటి గెలుస్తారా?

బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవరూ పెద్దగా క్రేజ్ ఉన్నవాళ్లు లేరు. సీజన్ 4 కి [more]

Update: 2020-09-16 07:06 GMT

బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవరూ పెద్దగా క్రేజ్ ఉన్నవాళ్లు లేరు. సీజన్ 4 కి అదే పెద్ద మైనస్. అయితే ఈ సీజన్లో లాస్య, నోయెల్, అమ్మ రాజశేఖర్ లాంటి వాళ్ళు తప్ప మిగతావారినెవరు పెద్దగా చూసింది లేదు.. అలాంటిది ఈ షో ఎలా 100 రోజులు గడుస్తుందో అందులోని.. సోమవారం ఎలిమినేషన్స్ విషయంలో ఇంటి సభ్యులంతా బుర్ర లేకుండా ఎవరికీ వారు త్యాగం చేసుకుని ఎలిమినేషన్స్ కి వెళ్లారు. ఎవరిని ఎలిమినేటి చేసిన హార్ట్ అవుతారంటూ బిగ్ బాస్ గేమ్ ని సేఫ్ గా ఆడేస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ పారితోషకాల మీద బయట పెద్ద చర్చే నడుస్తుంది.

కొద్దిగా ఫేమ్ ఉన్న యాంకర్ లాస్య, అమ్మ రాజశేఖర్ లకి రోజుకి లక్ష చొప్పున ఫిక్స్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. ఇక నోయెల్ కి హీరోయిన్ మోనాల్ కి రోజుకి 50 వేల ఫిక్స్ చెయ్యగా గంగవ్వ, టివి 9 యాంకర్ దేవికి, కరాటే కళ్యాణి, హీరోయిన్ దివికి, హీరో అభిజిత్ కి రోజుకి 25 వేల చొప్పున, మిగతా కంటెస్టెంట్స్ కి రోజుకి 10 వేల చొప్పున ఫిక్స్ చేశారట. మరి యాంకర్ లాస్య, అమ్మ రాజశేఖర్ షో లో 100 రోజులుంటే 1 కోటి పట్టుకెలెత్తారు. అలాగే బిగ్ బాస్ విన్ అయితే అదనంగా మరో 50 లక్షలన్నమాట. మరి లాస్య, అమ్మ రాజశేఖర్ లు 100 రోజులుంటారా? లేదా అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఇక నోయెల్, దివి, దేవి లాంటి వాళ్ళు ఎన్ని రోజులు షో లో ఉంటేపెద్ద మొత్తం అందుకుంటాని అంటున్నారు. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కి క్వారంటైన్ లోను స్టార్ మా పారితోషకాలు చెల్లించింది అనే టాక్ ఉంది

Tags:    

Similar News