బిగ్ బాస్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్ ఈ హీరోనే..!

Update: 2018-09-29 06:56 GMT

బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం ఫైనల్ జరగబోతుంది. 110 రోజుల పాటు మనల్ని ఎంటెర్టైన్ చేసిన పార్టిసిపెంట్స్ ఫైనల్ కి చేరుకున్నారు. చివరికి ఐదుగురు మిగిలారు. ఐదుగురిలో ఒక్కరు టైటిల్ విన్నర్ కానున్నారు. సీజన్ మధ్య నుంచి కౌశల్ ఆర్మీ తమ బలాన్ని సోషల్ మీడియాలో చూపుతున్నారు. అందరికంటే అతనికే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి అని తెలుస్తుంది. ఆల్రెడీ కొన్ని ఏరియాస్ లో ఫైనల్ ను వీక్షించేందుకు కౌశల్ ఆర్మీ కొన్ని చోట్ల స్క్రీనింగ్ వేసి టికెట్స్ కూడా పెట్టారు. మరి ఇంత చేస్తున్న కౌశల్ కి టైటిల్ ఇస్తారా.? లేదా తనని కాదని వేరే ఎవరికైన ఇస్తారా.? అనే ఆస‌క్తి అంత‌టా నెల‌కొంది. దీనిపై బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి.

ఇక్కడ వెంకటేష్... అక్కడ విజయ్...

ఇది ఇలా ఉంటె ఫైనల్ కు చీఫ్ గెస్ట్ ఎవరు? అనే ఉత్సుక‌త కూడా ఉంది. సీజన్ 1 హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ వస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తన 'అరవింద సమేత' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి అతను రావడం కుదరదు. ఇంకొంతమంది స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. అయితే లాస్ట్ కి బిగ్ బాస్ ఫైన‌ల్‌కి గెస్ట్‌ గా వెంక‌టేష్ రానున్నాడ‌ని తెలుస్తోంది. 'మా' బృందం ఆయనను సంప్రదించగా ఓకే చెప్పాడని తెలుస్తుంది. సో వెంకటేష్ చేతులు మీదగా టైటిల్ ట్రోఫీ ని అందించనున్నారు. బిగ్ బాస్ త‌మిళ వెర్ష‌న్ ఫైన‌ల్‌కి గెస్ట్‌ గా విజయ్ దేవరకొండ వెళ్లనున్నాడని తెలుస్తోంది. 'నోటా' ప్రొమోషన్స్ తో బిజీగా ఉన్న విజయ్ ప్రొమోషన్స్ లో భాగంగా వెళ్లనున్నాడని సమాచారం. అతను నటించిన 'నోటా' సినిమా వచ్చే నెల 5న మన ముందుకు రాబోతుంది.

Similar News