అఫిషియల్ : 205 కోట్లు వసూల్ చేసిన భరత్!

Update: 2018-05-13 08:34 GMT

టాలీవుడ్ భవిషత్తును ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలు మార్చేశాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సమ్మర్ లో విడుదల అయిన 'రంగస్థలం'..'భరత్ అనే నేను'..'నా పేరు సూర్య'.. 'మహానటి' సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచేసాయి. అందులో మరీ ముఖ్యంగా రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమా, కొరటాల - మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'భరత్ అనే నేను'.

బాక్సాఫీసు వద్ద పోటీ పడుతూ....

ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. 'భరత్ అనే నేను' లేటెస్ట్ గా రూ. 205 కోట్లు దాటిందని..నిర్మాత డీవీవీ దానయ్య తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తొలి రోజునుండి రికార్డుల వేట కొనసాగిస్తున్న ఈ సినిమా మూడు వారాల్లోనే రూ. 205 కోట్లను తాకడం గమనార్హం.

రికార్డుల మీద రికార్డులు....

తొలి రోజు 40 కోట్లుని వసూల్ చేసిన ఈ సినిమా..మొదటివారంలో రూ. 161 కోట్లను, ఆపై రెండో వారంలో రూ. 190 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓవరాల్ గా మూడువారాలు వచ్చేసరికి రూ. 205 కోట్లు గ్రాస్ ని వసూల్ చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మహేష్ జూన్ నుండి వంశీ పైడిపల్లి సినిమాలో నటించనున్నాడు.

Similar News