ధనుష్ సినిమాని రీమేక్ చేస్తున్న బెల్లం బాబు

బెల్లంకొండ శ్రీనివాస్ నిన్నటివరకు ఛత్రపతి రీమేక్ కోసం బాలీవుడ్ లోనే తిష్ట వేసాడు. అక్కడ మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ పెట్టడంతో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ కి వచ్చేసాడు. [more]

Update: 2021-04-30 08:35 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ నిన్నటివరకు ఛత్రపతి రీమేక్ కోసం బాలీవుడ్ లోనే తిష్ట వేసాడు. అక్కడ మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ పెట్టడంతో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ కి వచ్చేసాడు. లేదంటే ముంబై లో జిమ్ కి వెళుతూ.. అక్కడే ఇల్లు రెంట్ కి తీసుకుని ఛత్రపతి రీమేక్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు బాబు. ఇక్కడ టాలీవుడ్ లో అల్లుడు అదుర్స్ మూవీ తో డిజాస్టర్ కొట్టిన బెల్లంకొండ.. తన తదుపరి మూవీ ఛత్రపతి రీమేక్ ని ఓకె చేసాడు.. ఇప్పడు మరో రీమేక్ కోసం రెడీ అవుతున్నాడట. అది తమిళంలో ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ కర్ణన్‌ తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ నటిస్తున్నట్లు తెలుస్తుంది. కొడుకు కోసం బెల్లంకొండ సురేష్ కర్ణన్ రీమేక్ రైట్స్‌ను కొనేసినట్లుగా టాక్.
మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధనుష్ హీరోగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ కర్ణన్ మూవీ తెరకెక్కింది. గతంలో తమిళ రచ్చసన్ ని తెలుగులో రీమేక్ చేసి రాక్షసుడుగా హిట్ కొట్టిన బెల్లంకొండ కి అల్లుడు అదుర్స్ స్ట్రయిట్ తెలుగు మూవీ షాకిచ్చింది. తర్వాత బాలీవుడ్ లో ఛత్రపతి మూవీ రీమేక్ ని నమ్ముకున్న బెల్లంకొండ మళ్ళీ ఇప్పుడు తమిళ్ లో సూపర్ హిట్ అయిన కర్ణన్ మూవీ రీమేక్ ని నమ్ముకుంటున్నాడు. తమిళంలో ఏప్రిల్ 9 న విడుదలైన కర్ణన్ మూవీ థియేటర్స్ లో కోట్లు కొల్లగొట్టడంతో బెల్లంకొండ సురేష్ ముందు ముందు ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేశారు.  

Tags:    

Similar News