బెల్లంకొండకు జోడీగా కాజల్..

Update: 2018-06-01 09:56 GMT

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా, పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ ఓ సినిమా తెరకకెక్కనుంది. ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్ల 50 లక్షలకు అమ్ముడు అయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితీష్ ముఖేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ మధ్య కొన్ని కీలక సీన్స్ చిత్రీకరుస్తున్నారు.

తారాగణం..సాంకేతిక వర్గం..

భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, కళ్యాణి నటరాజన్, అపూర్వ ముఖ్య పాత్రల్లో లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చాగంటి శాంతయ్య కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డు రచయితగా పని చెయ్యడం విశేషం.

Similar News