జాగ్రత్తగా ఉండండి లావు అయిపోతారు!

లాక్ డౌన్ సమయంలో మన సెలెబ్రెటీస్ ఏది పడితే అది చేస్తున్నారు. తమకు ఇష్టమొచ్చిన పనులు చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. కొందరు వంటలు నేర్చుకుంటుంటే .. [more]

Update: 2020-05-08 04:33 GMT

లాక్ డౌన్ సమయంలో మన సెలెబ్రెటీస్ ఏది పడితే అది చేస్తున్నారు. తమకు ఇష్టమొచ్చిన పనులు చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. కొందరు వంటలు నేర్చుకుంటుంటే .. మరికొందరు పుస్తకాలూ చదవడం… సినిమాలు చూడటం .. వ్యాయామాలు చేయడం వంటివి చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. అలానే మన మహేష్ హీరోయిన్ కూడా.

భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా కియారా అద్వానీ కూడా అందరిలా కొత్త వంటలు నేర్చుకుంటుంది. “నేను కూడా అందరిలా వంటలు చేయడంలో మునిగిపోయాను. అల అని ఏదిపడితే అది తినడం లేదు. ఎందుకంటే ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.  ఇప్పుడు ఖాళీగా  ఉన్నాం..  ఏదిపడితే అది తింటే లావు అయిపోతాం. లాక్ డౌన్ తరువాత షూటింగ్ స్టార్ట్ అయ్యేనాటికి లావు తగ్గడం కష్టం అవుతుంది. సో నేను చాలా కంట్రోల్ గా ఉంటున్న. అందుకే ఫిట్నెస్ పైన కూడా శ్రద్ద పెడుతున్న” అంటుంది అద్వానీ. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉంది

Tags:    

Similar News