శ్రద్ద వద్దంటున్న బన్నీ ఫాన్స్!!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కాల్సిన పాన్ ఇండియా మూవీ పుష్ప కరోనా కారణంగా లేట్ అయ్యింది కానీ.. లేదంటే ఈపాటికి ఒకటి రెండు షెడ్యూల్స్ [more]

Update: 2020-08-19 06:28 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కాల్సిన పాన్ ఇండియా మూవీ పుష్ప కరోనా కారణంగా లేట్ అయ్యింది కానీ.. లేదంటే ఈపాటికి ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యేయి. కానీ కరోనా మహమ్మారి వలన బన్నీ ప్లాన్స్ అన్ని ప్లాప్ అయ్యాయి. అయినా బన్నీ పుష్ప లుక్ లోనే తిరుగుతూన్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. ఇక మిగతా నటులను సుకుమర్ ఎక్కువగా బాలీవుడ్ నటులనే ఎంపిక చేసి..వాళ్ళ పాత్రలకు కావాల్సిన ట్రైనింగ్ ఫోన్ లోనే స్టార్ట్ చేసాడట. పాన్ ఇండియా అప్పీల్ రావాలంటే అంతా సౌత్ నటులైతే సరిపోదు.. బాలీవుడ్ నటులు కూడా అవసరమని సుకుమార్ భావిస్తున్నాడట.

ఇక హీరోయిన్ ని సౌత్ నుండి తీసుకున్నాం కదా.. ఐటెం గర్ల్ ని బాలీవుడ్ నుండి తీసుకోబోతున్నారట. సుకుమర్ – మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కాంబో ఐటెం సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసు. అందులోను దేవిశ్రీ ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్. రంగస్థలం లాంటి కథలోనే పూజ హెగ్డే తో అదిరిపోయే ఐటెం చేయించిన సుకుమార్ పుష్ప పాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ ని తీసుకోబోతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే ప్రభాస్ తో సాహో లో నటించిన శ్రద్ద లుక్స్ పరంగాను, గ్లామర్ పరంగాను తేలిపోవడంతో.. బన్నీ సినిమాలో శ్రద్ద ఐటెం సాంగ్ వద్దు అని సుకుమార్ కి అల్లు అర్జున్ ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట.

ముందు కియారని అనుకుని మల్లి శ్రద్ద కపూర్ అంటుంటే బన్నీ ఫాన్స్ కంగారు పడుతున్నారట. ఐటెం కోసం బాలీవుడ్ భామే కావాలనుకుంటే ఏ కత్రినా కైఫ్ నో తీసుకురండి కానీ.. శ్రద్ద మాత్రం వద్దంటున్నారట బన్నీ ఫాన్స్. మరి సుకుమార్ ఫైనల్ గా అల్లు అర్జున్ ఐటెం కోసం ఏ బాలీవుడ్ హీరోయిన్ ని దింపుతాడో చూడాలి. 

Tags:    

Similar News