మహేష్ కోసం భారీ బ్యాంకు సెట్!!

మహేష్ బాబు – పరశురామ్ కలయికలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అనేది ఇప్పట్లో క్లారిటీ లేదు. ఎందుకంటే కరోనా వలన [more]

Update: 2020-06-28 14:41 GMT

మహేష్ బాబు – పరశురామ్ కలయికలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అనేది ఇప్పట్లో క్లారిటీ లేదు. ఎందుకంటే కరోనా వలన మహేష్ బాబు ఇప్పుడప్పుడే సర్కారు వారి పాట కోసం సిద్ధమయ్యేలా కనిపించడం లేదు. అందుకే పరశురాం కూడా మహేష్ ఇచ్చిన సమాయంతో ప్రీ ప్రొడక్షన్ ని పరిగెత్తిస్తున్నాడు. నటుల ఎంపిక తో పాటుగా లోకేషన్స్ సెర్చింగ్, అలాగే సినిమాల కోసం సెట్స్ నిర్మాణం కూడా మొదలు పెట్టినట్టుగా టాక్. హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన చిత్ర బృందం ఇప్పడు సినిమాకి కావాల్సిన సెట్స్ మీద ఫోకస్ పెట్టిందట.

మహేష్ సర్కారు వారి పాట సినిమా ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ చుట్టూ తిరుగుతుంది అని.. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, మోసాల నేపథ్యంలో సాగే సినిమా అని ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఆ బ్యాంకు సంబందించిన సెట్ ఆపనులు మొదలయ్యాయని.. ఓ ప్రముఖ స్టూడియో లో ఓ ఫ్లోర్ మొత్తం ఈ బ్యాంకు సెట్ కోసం వినియోగిస్తున్నారని.. మహేష్ చేసిన సినిమాలన్నిటిలోను ఈ బ్యాంకు సెట్ అత్యంత ఖరీదైన సెట్ అని అంటున్నారు. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని ఎదురించే కుర్రాడిగా.. మహేష్ ఈ బ్యాంకు చుట్టూతానే ఎక్కువగా తిరగడం, సినిమాలోకి కీలక సన్నివేశాల్ని ఈ బ్యాంకు సెట్ లో ఉండబోతున్నాయట. ఈ బ్యాంకు సెట్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిందట చిత్ర బృందం. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సెట్ నిర్మాణం చెప్పటారట. అలాగే ప్రీ ప్రొడక్షన్స్ లో భాగముగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయట. థమన్ – పరశురామ్ కలిసి సిట్టింగ్స్ లో పాల్గొని మహేష్ కి ఫోన్ లోనే వినిపిస్తున్నారని టాక్. 

Tags:    

Similar News