బండ్లకి షాకిచ్చిన సరిలేరు నీకెవ్వరూ టీం

కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న బండ్ల కి సరిలేరు నీకెవ్వరూ టీం షాకివ్వడమేమిటి అనుకుంటున్నారా… అదేనండి గతంలో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన బండ్ల [more]

Update: 2019-08-20 07:11 GMT

కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న బండ్ల కి సరిలేరు నీకెవ్వరూ టీం షాకివ్వడమేమిటి అనుకుంటున్నారా… అదేనండి గతంలో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ తర్వాత ఓ బడా రాజకీయనాయకుడు అండతో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించాడు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు. కానీ గత కొన్నాళ్లుగా నిర్మాతగా కూడా బండ్ల కనిపించడం లేదు. ఇక తాజాగా చాలారోజుల తర్వాత మొహానికి రంగేసుకుని కమేడియన్ గా మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహేష్ బాబు తో సినిమా, దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ డైరెక్టర్ అనేసరికి బండ్ల గణేష్ ఎగిరి గంతేసి ఈ సినిమా ఒప్పుకోలేదు.

సరిలేరు నీకెవ్వరూ సినిమాలో బండ్ల కామెడీ చేసినందుకు గాను.. రోజుకి ఐదు లక్షల ఆఫర్ చెయ్యడం… బండ్ల గణేష్ కి ఆ ఆఫర్ నచ్చి ఈ సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అయితే మహేష్ – అనిల్ రావిపూడి కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ ని ఓ రేంజ్ లో పరిగెత్తిస్తున్నారు. ట్రైన్ స్పీడు కన్నా వేగంగా అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్నాడు. బండ్ల గణేష్ అండ్ కమెడియన్స్ బ్యాచ్ చేసే కామెడీ సినిమాకే హైలెట్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే రోజుకి ఐదు లక్షల పారితోషకంతో హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ కి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ టీం షాకిచ్చిందట. ఎందుకంటే బండ్ల తో ఉన్న సీన్స్ ని కేవలం నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసి బండ్ల చేతిలో 20 లక్షలు పారితోషకం పెట్టారట. మరి రోజుకి ఐదు లక్షలు. నాలుగు రోజులకి 20 లక్షలుగా… అలా అన్నమాట. అయితే ఇది బండ్ల గణేష్ అసలు ఊహించలేదట. బడా సినిమా డేట్స్ అడిగారంటే మినిమం ఓ పది రోజులు అయినా ఉంటయనుకున్నాడట. కానీ సరిలేరు టీం మాత్రం కేవలం నాలుగు రోజులకే బండ్ల ని ఇంటికి పంపేసింది

Tags:    

Similar News