బాలయ్య మరో షాకిచ్చాడు!!

బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు దెబ్బకి సినిమాలు మొదలుపెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. అలాగే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమితో బాలయ్య ప్రస్తుతం బయట కనిపించడం లేదు. [more]

Update: 2019-05-29 04:00 GMT

బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు దెబ్బకి సినిమాలు మొదలుపెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. అలాగే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమితో బాలయ్య ప్రస్తుతం బయట కనిపించడం లేదు. బాలయ్య మరోమారు హిందూపూర్ నుండి ఎమ్యెల్యే గా ఎన్నికైనా టిడిపి ఘోర పరాజయం బాలయ్యని ఇబ్బంది పెట్టే విషయమే. ఇక ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అయితే బోయపాటి తో సినిమా చేసేవాడే. కానీ ఆ సినిమాలు ప్లాపవ్వడంతో బోయపాటి తో చేయాల్సిన సినిమాను బాలయ్య క్యాన్సిల్ చేసాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. అందుకే జై సింహ డైరెక్టర్ రవికుమార్ తో మరో సినిమా అనౌన్స్ చేసాడు బాలయ్య. సి కళ్యాణ్ నిర్మాతగా రేపో మాపో పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జగన్ కధకు….

బాలయ్య – ఏ ఎస్ రవికుమార్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా విషయంలో సోషల్ అండ్ వెబ్ మీడియాలో చాలా రకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని… అలాగే లెజెండ్ తో విలనవతారమెత్తిన జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ నడిచింది. తాజాగా బాలయ్య – రవికుమార్ కాంబో మూవీ కొన్ని కారణాలతో ఆగిపోయింది. కారణం ఏపీ లో ప్రస్తుతం సీఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న జగన్ కు బాలయ్య – రవికుమార్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కథకు కాస్త దగ్గర పోలికలు ఉన్నాయట. మరి జగన్ పార్టీ వైసిపి గెలవకపోతే ఆ సినిమా పట్టాలెక్కేది. కానీ జగన్ గెలవడం, సీఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి రెడీ అవడంతో.. ఇప్పుడు గనక ఇలాంటి కథతో సినిమా చేస్తే బాగోదని ఉద్దేశ్యంతోనే ఆ సినిమా ఆగినట్లుగా ఫిలింనగర్ టాక్. కథ మార్చాలంటే చాలా తతంగం కాబట్టే సినిమానే ఆపేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

Tags:    

Similar News