హిట్ కాంబో రిపీట్ చేస్తున్న బాల‌య్య‌

నటసింహ నందమూరి బాలకృష్ణ మరోసారి తమిళ దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ తో ఓ పవర్ ఫుల్ చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మరోసారి ఈ కాంబినేషన్ ను [more]

Update: 2019-05-07 06:36 GMT

నటసింహ నందమూరి బాలకృష్ణ మరోసారి తమిళ దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ తో ఓ పవర్ ఫుల్ చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మరోసారి ఈ కాంబినేషన్ ను తెరకెక్కించనున్నారు. సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ ఈ సినిమాను రూపొందనుంది. గతంలో వీరి కాంబినేషన్ లో 'జైసింహా' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణ మరోసారి కె.ఎస్‌.ర‌వికుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీలో విలన్ గా మరోసారి జగపతి బాబు నటిస్తున్నాడు. లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత జగపతిబాబు బాలయ్యతో చేయడం ఇదే రెండోసారి.

17 నుంచి ప్రారంభం

అలానే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. సేమ్ 'జైసింహా' కి ఎవరైతే పని చేసారో వాళ్లనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు. మే 17న ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. హిట్ కాంబినేషన్ తో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి దీని అంచనాలు ఇప్పటి నుండే ఉన్నాయి.

Tags:    

Similar News