బయ్యర్లను బాలయ్య ఏం చేస్తారో..?

తండ్రి బయోపిక్ తో నిర్మాతగా బాలకృష్ణ కోట్లు వెనకేసుకుందామనుకుంటే… మొదటికే మోసం వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ నిండా మునిగాడు. కాదు కాదు బయ్యర్లను నిండా [more]

Update: 2019-02-28 08:28 GMT

తండ్రి బయోపిక్ తో నిర్మాతగా బాలకృష్ణ కోట్లు వెనకేసుకుందామనుకుంటే… మొదటికే మోసం వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ నిండా మునిగాడు. కాదు కాదు బయ్యర్లను నిండా ముంచాడు. రెండు పార్ట్ లకు 50 కోట్ల బడ్జెట్ అయితే.. కథానాయకుడు సినిమాని 70 కోట్లకి బయ్యర్లకి అమ్మేశాడు. కానీ కథానాయకుడు దెబ్బకి బయ్యర్లు బెంబేలెత్తారు. కథానాయకుడుతో బయ్యర్లు అక్షరాలా 50 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఇక బయ్యర్లు బాలయ్యని నిలదీసి అడగకుండా మహానాయకుడు హక్కులు ఇస్తే చాలన్నట్టుగా ఊరుకున్నారు. అయితే బాలయ్య మాత్రం కథానాయకుడుకి వచ్చిన నష్టంలో మూడోవంతు భరిస్తామని మాట మాత్రం ఇచ్చి… రెండవ చిత్రం మహానాయకుడ్ని పర్సంటేజ్‌ పద్ధతి మీద విడుదల చేసాడు.

నిండా మునిగిన బయ్యర్లు…

మరి కథానాయకుడు లాస్ 50 కోట్లు ఉంటే.. మహానాయకుడు ఫుల్ రన్ లో కేవలం ఐదు కోట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మహానాయకుడు సినిమాకి కనీసం థియేటర్స్ రెంట్ కానీ, కరెంట్ బిల్లులు కానీ వచ్చే పరిస్థితులు లేక…ఆఖరుకి టిడిపి కార్యకర్తలంతా కలిసి మహానాయకుడు షోస్ ని ఫ్రీగా వేయిస్తున్నారు. ఎన్టీఆర్ పై సినిమా చేసి అయన గౌరవాన్ని దిగజార్చే పని చేసిన బాలకృష్ణ ఒకపక్క పరువు పోగొట్టుకోవడం, మరోపక్క ఆర్థికంగానూ బాగా లాస్ అయ్యాడు. మరి కథానాయకుడు విషయంలో కాస్త వెనక్కి తగ్గినా బయ్యర్లు మహానాయకుడు దెబ్బకి బాలయ్యని ఏం చేస్తారో అంటున్నారు.

బాలయ్యను అడగగలరా..?

కథానాయకుడు నష్టాల్లో మూడో వంతు ఇస్తామని మాట అయితే ఇచ్చారు కానీ ఇంకా వెనక్కి ఏమీ ఇవ్వలేదంటున్నారు. మరి ఇప్పుడు మహానాయకుడు కూడా కోలుకోలేని దెబ్బేసింది. మరి బాలయ్య ఇప్పుడు బయ్యర్లను ఎలా డీల్ చేస్తాడో అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. కథానాయకుడు లాస్ వచ్చినపుడు బాలయ్యకి జడిసి బయ్యర్లు నోరెత్తలేదనే టాక్ అయితే నడిచింది. మరి ఇపుడు కథానాయకుడు, మహానాయకుడు లాస్ తో బయ్యర్లు బాలయ్యకి భయపడితే.. వాళ్లకు పీకల్లోతు నష్టాలు తప్పవు.

Tags:    

Similar News