లెజెండ్ తో కామెడీ డైరెక్టర్

ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా తెరకెక్కించిన ఎఫ్ టు సినిమాలు మరో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. [more]

Update: 2019-01-04 08:35 GMT

ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా తెరకెక్కించిన ఎఫ్ టు సినిమాలు మరో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడనే న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కామెడీ డైరెక్టర్ గా పేరున్న అనిల్ రావిపూడి లెజెండ్ బాలకృష్ణ ని డైరెక్ట్ చేయబోతున్నాడని.. ఆ క్రేజీ కాంబో కి దిల్ రాజు నిర్మాత అనే న్యూస్ మాములుగా స్ప్రెడ్ అవ్వలేదు. అయితే ఎన్టీఆర్ యోపిక్ తర్వాత ఫిబ్రవరిలో బాలకృష్ణ బోయపాటి శ్రీను తో ఒక చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

బోయపాటి – బాలయ్య ల సినిమా ఎన్ బీ కే ఫిలిమ్స్ పై తెరకెక్కుతోందని ఆఫీసియల్ అనౌన్సమెంట్ ఉంది. అయితే ఎఫ్ టు తర్వాత అనిల్ రావిపూడి, బాలకృష్ణ సినిమా కథ మీదే కూర్చోబోతున్నాడట. మరి బోయపాటి సినిమా ఫినిష్ కాగానే బాలయ్య, అనిల్ తో సినిమాని లైన్ చేసాడేమో. ఇక అనిల్ రావిపూడి తో రెండు సినిమాలకు నిర్మాతగా పనిచేసిన దిల్ రాజు ఇప్పుడు బాలకృష్ణ తో చెయ్యబోయే సినిమాకి కూడా నిర్మాతగా చెయ్యాలనుకుంటున్నాడని తెలుస్తుంది. ఆ విషయంలో మాత్రం బాలయ్య నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది.

కాకపోతే బాలకృష్ణ ఇకమీదట తాను నటించినబోయే సినిమాలన్ని ఎన్ బీ కే బ్యానర్ పైనే చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల నేపథ్యంలో బాలకృష్ణ దిల్ రాజు ప్రపోజల్ కి ఓకె చెప్తాడా… లేదా… అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News