బాలయ్య మళ్లీ ఆ తప్పు చేస్తాడా..?

బాలకృష్ణ హీరోగా ఇప్పటికీ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. గత ఏడాది మార్చ్ లో తన తండ్రి బయోపిక్ ని మొదలుపెట్టి ఏడాది తిరక్కుండానే రెండు పార్టులుగా సినిమాని విడుదల [more]

Update: 2019-02-26 07:35 GMT

బాలకృష్ణ హీరోగా ఇప్పటికీ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. గత ఏడాది మార్చ్ లో తన తండ్రి బయోపిక్ ని మొదలుపెట్టి ఏడాది తిరక్కుండానే రెండు పార్టులుగా సినిమాని విడుదల చేసాడు. హీరోగా జోరు చూపించడమే కాదు.. కొత్తగా ఎన్బీకే ఫిలిమ్స్ ని స్థాపించి తన సినిమాలను తానే నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ ని తన ఓన్ బ్యానర్ ఎన్బీకే ఫిలిమ్స్ లోనే సాయి కొర్రపాటి మరో పార్టనర్ తో కలిసి నిర్మించాడు. ఎన్బీకే ఫిలిమ్స్ లో ఎన్టీఆర్ బయోపిక్ ని భారీ బడ్జెట్ తోనే నిర్మించాడు. తండ్రి బయోపిక్ కి భారీ కేజ్ ఉంటుంది.. భారీగా లాభపడదామనుకున్నాడు బాలయ్య. ఆయనకు నివాళిగా నిర్మిస్తున్నాని చెప్పినా… లాభాలు ఆశించకుండా అయితే ఉండరు కదా.

రెండు సినిమాలూ దెబ్బతీయడంతో…

మరి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడుతో దాదాపుగా 50 కోట్ల నష్టాన్ని చవిచూశాడు బాలకృష్ణ. కథానాయకుడు కొన్న బయ్యర్లు.. మహానాయకుడితో అయినా కొలుకుంటారనుకుంటే.. మహానాయకుడు కలెక్షన్స్ రోజు రోజుకి దిగజారిపోతున్నాయు. కథానాయకుడుతో పాటు గా మహానాయకుడుని తీసుకున్న బయ్యర్ల నష్టాలు… బాలయ్య పూడుస్తాడో లేదో ఎవ్వరికీ క్లారిటీ లేదు. మరి ఎన్బీకే ఫిలిమ్స్ లో నిర్మించిన మొదటి రెండు చిత్రాలు ఘోరాతి ఘోరంగా దెబ్బతినడంతో.. మళ్లీ బాలయ్య మరో సినిమాని నిర్మించడానికి ఆలోచించాల్సిందే.

బోయపాటి డైరెక్షన్ లో…

కానీ బాలయ్యకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే బాలకృష్ణ బోయపాటి తో కమిట్ అయిన సినిమాని కూడా ఎన్బీకే ఫిలిమ్స్ లోనే ప్రొడక్షన్ నెంబర్ 3గా అనౌన్స్ చేసాడు. మరి కేవలం బాలకృష్ణే కాదు. బోయపాటి కూడా భారీ డిజాస్టర్ తో ఉన్నాడు. వినయ విధేయ రామతో బోయపాటి శ్రీను కూడా భారీగా దెబ్బతిని ఉన్నాడు. మరి బోయపాటిని నమ్మి బాలయ్య మళ్లీ ఎన్బీకే ఫిలిమ్స్ లోనే తన కొత్త సినిమా చేస్తాడో… లేదంటే మళ్లీ పార్ట్ నర్స్ ని కలుపుకుంటాడో అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరి ఎంతో కాన్ఫిడెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తే… ఆ సినిమాతో భారీ షాక్ తిన్నాడు. డిజాస్టర్ డైరెక్టర్ తో బాలయ్య మళ్లీ ఆ తప్పు చేస్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News