బాలయ్య రాజీ పడటంలేదట!

Update: 2018-07-14 07:39 GMT

తన తండ్రి జీవిత చిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడనుకోవాలనేది బాలయ్య కోరికట. అందుకే ఈ సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడట. బాలకృష్ణ కూడా సినిమాకి నిర్మాత కావడంతో డబ్బు విషయంలో వెనకాడటంలేదట. సినిమాకి ఏం కావాలో అవి క్షణాల్లో సమకూరుస్తున్నట్టు టాక్.

విద్యాబాలన్ అడగ్గానే...

ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ అడగ ఆమె ఆ పాత్ర కోసం 2 కోట్లు పారితోషికం అడిగిందట. బాలయ్య వెనక్కి తగ్గకుండా ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఓకే చెప్పాడంట. విద్యాబాలన్ లాంటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఉంటె జాతీయ స్థాయిలో పేరు వస్తుందని బాలయ్య భావించి ఆమెను సెలెక్ట్ చేసినట్టు టాక్.

అగ్రహీరోలతో....

అంతేకాకుండా ఇందులో టాలీవుడ్ లో పలువురు అగ్ర కథానాయకుల్ని 'ఎన్టీఆర్' బయోపిక్ లో భాగం చేసేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారట బాలయ్య. వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడంట బాలయ్య. ఈ ప్రాజెక్ట్ లోకి క్రిష్ భాగం కావడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గురించి పలు సినీ ఇండస్ట్రీ వాళ్లు మాట్లాడుకోవటం విశేషం.

Similar News