మళ్లీ వస్తున్న బాహుబలి

Update: 2018-07-05 12:52 GMT

తెలుగు సినీ చరిత్రలో.. ఆ మాటకొస్తే దేశ సినిమా రంగమే గర్వపడే సినిమా బాహుబలి. దర్వకులు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారత్ లోనే కాదు విదేశాల్లోనూ కొత్త రికార్డులు సృష్టించింది. పెద్ద కథను ఎంచుకున్న రాజమౌళి రెండు భాగాలుగా సినిమాని తెరకెక్కించారు. ఎంతోమంది ఈ సినిమాకి అభిమానులుగా మారిపోయారు. అయితే, వీరిందరికీ ఓ శుభవార్త చెప్పింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. త్వరలోనే బాహుబలి ప్రీక్వెల్ తీయనున్నట్లు ప్రకటించింది. ఇది వెబ్ సీరిస్ వంటిదే. మూడు సీజన్ ల పాటు కొనసాగుతుంది.

తెలుగులో ప్రస్థానం సినిమా తీసి మంచి గుర్తింపు పొందిన దేవ కట్టా, రాజమౌళి సహకారంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. నెట్ ఫ్లిక్స్ సంస్థతో పాటు దేవ కట్టా కూడా కోప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో నటించేందుకు తెలుగు, తమిళ నటులను ఎంపిక చేస్తున్నారు. అయితే, మాహిష్మతి సామ్రాజ్య నేపథ్యం వంటి సినిమాలో చూపలేకపోయిన కథని ఇందులో తెరకెక్కించనున్నారు. మొదటి సీజన్ కి ‘ధి రైజ్ ఆఫ్ శివగామి’ అని పేరు నిర్ణయించినట్లు తెలిసింది.

Similar News