ఐష్ అయితే కలిసొస్తుందనా శంకర్

Update: 2018-09-30 10:40 GMT

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ - ఐశ్వర్యారాయ్ జంటగా వచ్చిన రోబో సినిమా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అయితే రోబో కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.ఓ సినిమాలో కూడా ఐష్ హీరోయిన్ గా నటిస్తుంది అనుకుంటే.. శంకర్ లండన్ భామ అమీ జాక్సన్ ని రజినీకాంత్ కి జోడిగా తీసుకొచ్చాడు. 2.ఓ సినిమా ఈ నవంబర్ 29 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. తాజాగా విడుదలైన 2.ఓ టీజర్ యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ తో లైకా వారు నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ లేట్ వలన సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ.. ఈ సినిమా మీద భారీ క్రేజ్ ఉంది.

అయితే ఈ క్రేజ్ ని మరింత పెంచే న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా... అమీ జాక్సన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ, రోబో హీరోయిన్ అయినా అందాల తార ఐశ్వర్య రాయ్ కూడా అతిధి పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ చిత్రంలో కూడా ఐష్ కొద్దీ సేపు స్క్రీన్ ఫై కనబడనుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే రోబో సినిమాలో ఐశ్వర్య ప్రేమకోసం ప్రపంచ వినాశనాన్నే తలపెట్టిన చిట్టి ద రోబో.... 2.ఓ లోను కీలక పాత్ర పోషిస్తుండగా....అతనికి తన గర్ల్ ఫ్రెండ్ ను చూసుకునే అవకాశం ఈ సినిమాలో ఉందట. అందుకోసం ఐశ్వర్యారాయ్ 2.ఓ గెస్ట్ రోల్ చేస్తుందనే సమాచారం ఉంది.

మరి శంకర్ రోబో సినిమాతో ఐష్ తో కలిసి రజినీకాంత్ హిట్ కొట్టడంతో.. సెంటిమెంట్ కోసమే 2.ఓ లో ఐష్ ని మరలా గెస్ట్ రోల్ కోసం తీసుకున్నాడని అంటున్నారు. ఐష్ కూడా ఈ సినిమా లో ఉంటే ఐష్ కున్న క్రేజ్ పరంగాను సినిమాకి మరింత బజ్ పెరుగుతుందని శంకర్ ఇలాంటి ప్లాన్ చేసాడంటున్నారు. ఇకపోతే భారీ విజువల్ వండర్గా తెరకెక్కుతున్నఈ చిత్ర ట్రైలర్ కూడా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.

Similar News