అశ్వినీదత్ ని పక్కన పెట్టేశారా..?

వంశీ పైడిపల్లితో పీవీపీ నిర్మాతగా ఊపిరి సినిమా చేసాడు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ లాభాలు రాలేదు. నిర్మాత కూడా నష్టాల‌పాలు కాలేదు. అయితే తాజాగా పీవీపీ, [more]

Update: 2019-05-14 06:44 GMT

వంశీ పైడిపల్లితో పీవీపీ నిర్మాతగా ఊపిరి సినిమా చేసాడు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ లాభాలు రాలేదు. నిర్మాత కూడా నష్టాల‌పాలు కాలేదు. అయితే తాజాగా పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్ క‌లిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాని భారీగా నిర్మించారు. ఆ సినిమా హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే సినిమా మొదలైనప్పటి నుండి బిజినెస్ జరిగే చివ‌రి రోజుల‌ వరకు ఆశ్వినీదత్ కి, దిల్ రాజు కి పొరపొచ్చాలు వస్తూనే ఉన్నాయి. అయితే దిల్ రాజు, అశ్వినీదత్ మధ్యలో పీవీపీ వేలు పెట్టకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇక మహర్షి సినిమాకి 7 కోట్లు అశ్వినీదత్ కి లాభం కింద ఇచ్చేసి అతన్ని దిల్ రాజు బ్యాచ్ వదిలించుకున్నారనే న్యూస్ నడిచింది.

అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశార‌ట‌

తాజాగా పివిపి, దిల్ రాజు ఇద్ద‌రూ మ‌ళ్లీ వంశీ పైడిపల్లితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. తమకు మహర్షి స్క్రిప్ట్ చెప్పినప్పుడే వంశీతో మరో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యారట. పివిపి – దిల్ రాజు – వంశీ పైడిపల్లి కాంబోలో మరో సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది. మహర్షి సినిమా మాటల్లోనే ఈ మరో సినిమా మాటలు కూడా జరిగాయని… అందుకుగానూ వంశీ పైడిపల్లికి మూడు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ పీవీపీ, దిల్ రాజు లాక్ చేశారనే టాక్ నడుస్తుంది. అయితే ఈసారి ఈ డీల్ లో అశ్వినీదత్ ని దిల్ రాజు, పీవీపీ ఎంటర్ కానివ్వకుండా వీరిద్దరే ప్లాన్ చేశారనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ఆ సినిమాకి హీరో ఎవరనేది వంశీ పైడిపల్లి రాసుకునే స్క్రిప్ట్ ని బట్టి దిల్ రాజు సెట్ చేస్తాడంటున్నారు. మరి వంశీ మరో మంచి స్క్రిప్ట్ తో వస్తే మళ్లీ భారీ నిర్మాతలు వంశీకి దొరికినట్టే..!

Tags:    

Similar News