చిరు కోసం స్టైలిష్ విలన్!!

చరణ్ ధ్రువ సినిమాతో స్టైలిష్ హీరో అరవింద్ స్వామి తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ధ్రువ సినిమాలో రామ్ చరణ్ కేరెక్టర్ కి, ఆయన నటనకు [more]

Update: 2020-11-25 05:12 GMT

చరణ్ ధ్రువ సినిమాతో స్టైలిష్ హీరో అరవింద్ స్వామి తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ధ్రువ సినిమాలో రామ్ చరణ్ కేరెక్టర్ కి, ఆయన నటనకు ఎంతగా పేరొచ్చిందో.. విలన్ కేరెక్టర్ అరవింద్ స్వామికి అంతే పేరు వచ్చింది. స్టైలిష్ లుక్స్ తోనే విలనిజాన్ని పండించిన అరవింద స్వామి తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల వైపు చూడకపోయినా సెకండ్ ఇన్నింగ్స్ లో తమిళనాట ఫుల్ బిజీ. అయితే తాజాగా రామ్ చరణ్ కి విలన్ గా ఆదరగొట్టిన అరవింద్ స్వామి ఇప్పుడు చిరు కి విలన్ గా మారబోతున్నాడట. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది.

తాజాగా ఆచార్య విలన్ అరవింద్ స్వామీ అని, చిరు ని ఆచార్య లో ఢీ కొట్టబోయేది అరవింద్ స్వామీ అంటున్నారు. రామ్ చరణ్ RRR షూటింగ్ ఫినిష్ చేసుకుని ఆచార్య సెట్ లోకి అడుగుపెట్టేవరకు విలన్ పరిచయం అపారని, రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ స్పాట్ కి రాగానే ఆచార్య విలన్ విషయం మూవీ టీం రివీల్ చేస్తుంది అని అంటున్నారు. ఈలోపే అరవింద్ స్వామి విలనిజాన్ని సోషల్ మీడియా పసిగట్టేసింది. మరి ఆచార్య టీం అధికారిక  ప్రకటన ద్వారా అరవింద్ స్వామిని ని విలన్ ని చేస్తే ఓకె.. లేదంటే కథ వేరుంటాది అంటున్నారు మెగా ఫాన్స్.

Tags:    

Similar News