ఆ కథకి ఈ స్టైలిష్ విలన్ అయితే పక్కాగా సెట్ అవుతాడు

మహేష్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకుడిగా తెరకెక్కనున్న సర్కారు వారి పాట రేపో మాపో షూటింగ్ కోసం సెట్స్ మీదకెళ్లబోతుంది. కరోనా కారణముగా షూటింగ్ ఆగింది కానీ… [more]

Update: 2020-10-02 18:35 GMT

మహేష్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకుడిగా తెరకెక్కనున్న సర్కారు వారి పాట రేపో మాపో షూటింగ్ కోసం సెట్స్ మీదకెళ్లబోతుంది. కరోనా కారణముగా షూటింగ్ ఆగింది కానీ… లేదంటే ఈపాటికి ఒకటి రెండు షెడ్యూల్స్ ని పరశురామ్ చక్కబెట్టేసేవాడే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు ఆఫీసర్ కొడుకుగా కనిపిస్తాడని.. అలాగే మహేష్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడని ఓ రోల్ లో మహేష్ పోకిరి టైప్ కేరెక్టర్ లో కనిపిస్తాడని టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక బాలీవుడ్ నటులు విద్యా బాలన్, అనిల్ కపూర్ సర్కారు వారి పాటలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని.. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని అంటున్నారు.

ఇక విలన్ గా స్టైలిష్ హీరో గా గతంలో అమ్మాయిల రాకుమారుడిగా కనిపించిన అరవింద్ స్వామి సర్కారు వారి పాటలో విలన్ గా కనిపిస్తాడనే టాక్ మొదలయ్యింది. అయితే నిజంగా అరవింద్ స్వామి అయితే సినిమా కథకు స్టైలిష్ విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అంటున్నారు. బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయి అక్కడ సెటిల్ అయ్యి ఇక్కడి బ్యాంకులను ముప్పుతిప్పలు పెట్టె విలన్ గా అరవింద్ స్వామి అయితేనే పర్ఫెక్ట్ అని.. పెద్దగా ఫైట్స్ గట్రా లేకుండా మైండ్ గేమ్ తోనే అరవింద్ స్వామి విలనిజాన్ని చూపించగల సత్తా ఉన్న స్టైలిష్ విలన్ అంటున్నారు. గతంలో రామ్ చరణ్ ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి స్టైలిష్ విలనిజాన్ని అందరూ ఫిదా అయినట్టుగానే మహేష్ తో అరవింద్ స్వామి తలబడితే అంతే ఫిదా అవుతారంటున్నారు.

Tags:    

Similar News