అనుష్క నెక్ట్స్ ఎవరితోనో తెలుసా?

Update: 2018-05-17 07:07 GMT

'బాహుబలి', 'భాగమతి' సినిమాల సక్సెస్ తర్వాత అనుష్క ఏ సినిమా చేయడానికి అంగీకరించలేదు. దీంతో ఈ లేడీ సూపర్ స్టార్ నెక్స్ట్ ఏ మూవీ ఎవరితో చేస్తుంది అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఒక యాక్షన్ హీరోతో జోడీగా చేయడానికి అంగీకరించిందనేది తాజా సమాచారం.

మళ్లీ గోపీతోనే...

కళ్యాణ్ రామ్ - తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం 'నా నువ్వే'. ఈ సినిమాను జయేంద్ర అనే డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అతను గోపీచంద్ తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అయితే గోపికి జోడిగా ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనే వేటలో అనుష్క పేరు వచ్చిందంట. వెంటనే అనుష్కను సంప్రదించగా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది.

పంతం పూర్తికాగానే...

గతంలో గోపీచంద్ - అనుష్క కాంబినేషన్ లో 'లక్ష్యం' 'శౌర్యం' సినిమలు వచ్చాయి. ఇది కూడా చేస్తే ఇది మూడవ సినిమా అయ్యిది. ప్రస్తుతం 'పంతం' చేస్తోన్న గోపీచంద్ ఆ షూటింగు పూర్తి కాగానే ఈ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

Similar News