అంత‌రిక్షం టీంను టెన్షన్ పెడుతుంది అదే..!

Update: 2018-12-21 06:22 GMT

వరుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి, అదితీ రావు హైద‌రి నటించిన 'అంత‌రిక్షం' సినిమా రిలీజ్ అయ్యింది. 'ఘాజీ' తరువాత సంకల్ప్ రెడ్డి తీసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. క్రిష్ నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రం టాక్ టీంను ఇబ్బంది పెడుతుంది. 'ఘాజీ' లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అందరినీ ఇంప్రెస్స్ చేసిన సంకల్ప్ ఈ సినిమాను తీర్చిదిద్దటంలో విఫ‌ల‌మ‌య్య‌డ‌ని తెలుస్తోంది. 'ఘాజీ'లో ఇండియా - పాకిస్తాన్ మధ్య అండర్ వాటర్ యుద్ధాన్ని ఎంతో ఉత్కంఠగా చూపించాడు. కానీ 'అంత‌రిక్షం' విషయంలో ఫస్ట్ హాఫ్ తో పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ తో అంతగా ఆకట్టుకోలేకపోయాడని సమాచారం.

ఫస్ట్ హాఫ్ ఓకే కానీ...

ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలు ఇంట్రడ్యూస్ చేయడం.. ఎటువంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రెయిట్ గా స్టోరీలోకి వెళ్లిపోతాడట. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వరుణ్ స్పేస్ సెంటర్ లో ఉండటంతో మాటలు అసలు ఉండవని అంతా మ్యూజిక్ తోనే మ్యానేజ్ చేసాడని తెలుస్తుంది. దింతో ఏ సెంటర్స్ లో ఈ సినిమా పాస్ అయిపోతుంది కానీ మాస్ జనాలు ఉండే బీ, సీ సెంట‌ర్స్ లో ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని యూనిట్ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. మాస్ ప్రేక్షకులు కూడా సెకండ్ హాఫ్ కి కనెక్ట్ అయితే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం మరో కొన్ని గంటల్లో ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలిసిపోనుంది.

Similar News