వారి చేతికి అన్నపూర్ణ స్టూడియోస్..?

Update: 2018-07-16 09:02 GMT

దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ నుండి చాలా మంచి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెద్ద సంస్థల్లో ఇది కూడా ఒకటి. అన్నపూర్ణ బ్యానర్ లో నాగేశ్వరరావు స్వయంగా చిత్ర నిర్మాణాలు చూసుకునే వారు.. ఆ తర్వాత ఆ బాధ్యతలు తన కొడుకు నాగార్జున స్వీకరించారు.

కుమారుల చేతికి బాధ్యతలు

నాగార్జున కూడా ఆ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి ఆ సంస్థను మరింత అగ్రపథాన నిలిపారు. ఇక అప్పుటి నుండి ఇప్పటివరకు ఆ స్టూడియోకి సంబంధించి అన్ని విషయాలు నాగార్జునే చూసుకునేవారు. అయితే తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆ స్టూడియో బాధ్యతలు తన తనయుల చేతికి దాదాపుగా చేరిందని అంటున్నారు.

సినిమాల నిర్మాణం చూసుకుంటున్న చై-సామ్

తన పెద్ద కుమారుడైన నాగ చైతన్య - సమంతలు ఆ బాధ్యలు తీసుకున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ బ్యానర్ లో సుశాంత్ హీరోగా "చి ల సౌ" చిత్రాన్ని తెరకెక్కించారు. దానికి సంబంధించి చైతన్య దంపతులు విరివిగా ప్రమోషన్లు చేస్తున్నారని.. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారని.. ఇక రిలీజ్ కు ముందు ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకుని రావాలని చూస్తున్నారట. ఇక రాబోయే రోజుల్లో అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చే సినిమాలన్నీ వారే దగ్గరుండి చూసుకుంటారని సమాచారం. అయితే మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వారి నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడవలసిందే.

Similar News