సర్కారు వారి పాటపై కొత్త న్యూస్!!

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో సర్కారు వారి పాట ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మూవీ టీం మాత్రమే కాదు.. మహేష్ ఫాన్స్ కూడా తెగ [more]

Update: 2020-09-07 04:30 GMT

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో సర్కారు వారి పాట ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మూవీ టీం మాత్రమే కాదు.. మహేష్ ఫాన్స్ కూడా తెగ ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ మాత్రం బయటికి రావడం లేదు. హీరోలంతా మెల్లిగా సెట్స్ మీదకెళుతున్నారు. కానీ మహేష్ మాత్రం ఎప్పుడు షూటింగ్ మొదలెడతాడో తెలియదు. మహేష్ కోసమే పరశురామ్ హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటుగా మూవీ టీం కూడా ఎదురు చూస్తుంది. అయితే మహేష్ కి విలన్ గా సర్కారు వారి పాట కోసం ఓ బాలీవుడ్ హీరోని దర్శకుడు పరశురామ్ సంప్రదిస్తున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో నడుస్తుంది. ఇప్పటికే పరశురామ్ బాలీవుడ్ హీరో కి ఫోన్ లోనే ఆయన కేరెక్టర్ గురించి వివరించాడని అంటున్నారు.

బాలీవడ్ సీనియర్ హీరోగా ఇప్పటికి సినిమాల్తో బిజీగా ఉన్న అనిల్ కపూర్ ని దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట విలన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఆయనకి కథ లోని విలన్ కేరెక్టర్ గురించి వివరించాడని.. అయితే అనిల్ కపూర్ ఇంకా పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. అనిల్ కపూర్ ఒప్పుకుంటే సర్కారు వారి పాటకి అనిల్ కపూర్ విలన్. మరి మహేష్ బాబు ఈ సినిమాలో డ్యూల్ రోల్ చేయబోతున్నాడని.. కీర్తి సురేష్ మహేష్ కి జోడిగా నటిస్తుంటే.. ఐటెం గర్ల్ ని కూడా పరశురామ్ ఒక టాప్ హీరోయిన్ నే తీసుకోబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మరి సర్కారు వారి పాట సెట్స్ మీదకెళ్ళేసరికల్లా బాలీవుడ్ విలన్ మహేష్ కోసం దిగుతాడేమో చూడాలి.

Tags:    

Similar News