నిందలేయ్యడానికి ఎంత ధైర్యం అంటున్న యాంకర్లు

రెండు రోజుల క్రితం టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు అంటూ మీడియాలో న్యూస్ రావడం తెలిసిందే. నటి లావణ్య జీఎస్టీ ఎగ్గొట్టడంతో.. జీఎస్టీ [more]

Update: 2019-12-23 06:17 GMT

రెండు రోజుల క్రితం టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు అంటూ మీడియాలో న్యూస్ రావడం తెలిసిందే. నటి లావణ్య జీఎస్టీ ఎగ్గొట్టడంతో.. జీఎస్టీ అధికారులు ఆమె ఇంటిపై ఆకస్మిక దాడులు చేసారని ఛానల్స్ లోనే కాదు… వెబ్ అండ్ ప్రింట్ మీడియాలో న్యూస్ రావడం.. ఆ వెంటనే లావణ్య త్రిపాఠి తో పాటుగా.. ప్రముఖ యాంకర్స్ అనసూయ, సుమ ఇళ్లపై కూడా జీఎస్టీ దాడులు అంటూ ఛానల్స్ న్యూస్ చిలవలుపలవులుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం టాప్ యాంకర్స్ గా టాలీవుడ్ ని దున్నేస్తున్న అనసూయ, సుమ ఇద్దరు జీఎస్టీ ఎగవేయడంతో.. వాళ్ళ ఇళ్లపై జీఎస్టీ అధికార్ల దాడులు అంటూ సోషల్ మీడియాలో, ఛానల్స్ లో ఒకటే న్యూస్ హల్చల్ చేసాయి.

అయితే నటి లావణ్య మాత్రం జీఎస్టీ దాడుల విషయమై ఎలాంటి స్పందన లేదు.. కానీ యాంకర్స్ సుమ, అనసూయ మాత్రం మీడియా మీద ఫైర్ అవుతున్నారు. ఇంకా సుమ అయితే సాఫ్ట్ గా ఓ వీడియో షేర్ చేసి తనపై తన ఇంటిపై ఎలాంటి జీఎస్టీ అధికారులు దాడులు చెయ్యలేదని, నేను అందరిలా సకాలంలో జీఎస్టీ చెల్లిస్తున్నా అని… అసలు ఇలాంటి ఫేక్ న్యూస్ లకు స్పందించనక్కర్లేదని, కానీ తప్పక స్పందించాల్సి వచ్చింది అంటూ చెప్పగా… అనసూయ మాత్రం ఇలాంటి న్యూస్ లు మీడియా ఎందుకు పుట్టిస్తుంది అంటూ ఫైర్ అయ్యింది. తనపై వచ్చే కామెంట్స్ ని చాకచక్యంగా తిప్పికొట్టే అనసూయ మీడియా మీద మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. నేను జీఎస్టీ ఎగ్గొట్టానని మీకెవరైనా చెప్పారా.. అయినా నిజంగా జరిగినవి ప్రజలకు చెప్పాల్సిన మీడియా.. ఇలా గాసిప్స్ ని ప్రచారం చెయ్యడం బాగోలేదంటూ ఇంతెత్తున లేచింది.

Tags:    

Similar News