కర్రా విరగలేదు.. పాము చావలేదు!!

జబర్దస్త్ ప్రోగ్రాం నుండి నాగబాబు వెళుతూ వెళుతూ జబర్దస్త్ లో పనిచేసుకునే కమెడియన్స్స్ ని, పాత కమెడియన్స్ ని తీసుకుని జీ ఛానల్ లో అదిరింది షో [more]

Update: 2020-08-25 04:58 GMT

జబర్దస్త్ ప్రోగ్రాం నుండి నాగబాబు వెళుతూ వెళుతూ జబర్దస్త్ లో పనిచేసుకునే కమెడియన్స్స్ ని, పాత కమెడియన్స్ ని తీసుకుని జీ ఛానల్ లో అదిరింది షో కి చేరాడు. ధనరాజ్, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, వేణు లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వదిలేసి అదిరింది షోలో కామెడీ చేసుకుంటున్నారు. నాగబాబు కూడా చాలామంది అంటే సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది లాంటివాళ్లు అందరూ వెళ్ళిపోతారని.. ఆఖరుకి అనసూయ కూడా వెళ్ళిపోతుంది అంటూ ప్రచారం జరిగినా వాళ్లు మాత్రం తెలివిగా అదిరిందికి వెళ్లకుండా జబర్దస్త్ లోనే ఉండిపోయారు.

అయితే తాజాగా అనసూయ భర్త తో కలిసి పాల్గొన్న బాపు బొమ్మకి పెళ్ళంట ప్రోగ్రాంలో అనసూయ మాట్లాడుతూ వేణు, ధన్ రాజ్ నా ఫేవరేట్. నిజంగా మీ స్కిట్స్‌ను నేను (జబర్దస్త్ లో) ఎంతో మిస్ అవుతున్నా…. కానీ ఇలాంటి కార్యక్రమం ద్వారా మళ్లీ నేరుగా మీ స్కిట్ చూసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది అనగానే దానికి ధనరాజ్ కూడా నలుగురిని మిస్ చేసుకొని ఒక్కదానివే ఎందుకు అక్కడ (జబర్దస్త్) ఉండడం. నువ్వు కూడా ఇక్కడికి (అదిరింది) వచ్చేయొచ్చుగా అని ధన్‌రాజ్ అనగానే అనసూయ వెంటనే వస్తున్నా కదా.. స్పేస్ లేకున్నా క్రియేట్ చేసుకొని మరీ వస్తున్నా. అని తెలివిగా కర్రా విరగకుండా.. పాము చావకుండా తెలివైన సంధానం ఇచ్చింది. ఎమన్నా మల్లి జబర్దస్త్ నుండి బయటికి రవాలి. లేదంటే జీ ఛానల్ కి దూరమవ్వాలి. అందుకే అనసూయ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ భలే సమాధానం చెప్పింది కదా..

Tags:    

Similar News