అనసూయ ఫ్రీగా చేసిందా.. లేదంటే..!

తన జోలికి వచ్చే వారిని చీల్చి చండాడేస్తుంది యాంకర్ అనసూయ. హీరోయిన్స్ అయితే పోనిలే రూమర్ కదా అని వదిలేద్దామనుకుంటారు. కానీ అనసూయ అలా కాదు.. తన [more]

Update: 2021-03-15 09:04 GMT

తన జోలికి వచ్చే వారిని చీల్చి చండాడేస్తుంది యాంకర్ అనసూయ. హీరోయిన్స్ అయితే పోనిలే రూమర్ కదా అని వదిలేద్దామనుకుంటారు. కానీ అనసూయ అలా కాదు.. తన జోలికి వచ్చిన వారిని లైవ్ షో పెట్టి మరీ తిడుతుంది. ఇకపోతే సినిమాల విషయం వచ్చేసరికి అనసూయ ఆచితూచి అడుగులు వేస్తుంది. అది ఐటెం సాంగ్ అయినా తనకి నచ్చితేనే చేస్తుంది. జానీ మాస్టర్ ఫ్రెండ్ అని బన్నీ వాస్ చెప్పాడని చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యలేదు. అనసూయ 25 లక్షల భారీ ఆఫర్ కి పడిపోయింది అన్నారు ఆ మధ్యన. అమ్మో మూడు రోజుల ఐటెం కి అనసూయ 25 లక్షలు అందుకుందనే ప్రచారం సాంగ్ వచ్చిన కొత్తల్లో జరిగింది.
కానీ ఇప్పుడు అదే రూమర్స్ క్రియేట్ చేసిన వారు ఆబ్బె.. లేదండి అనసూయ 25 లక్షల కోసం ఆ సాంగ్ చెయ్యలేదు. అసలు ఆ సాంగ్ కోసం అనసూయ డిమాండ్స్ ఏం లేవు.. జానీ మాస్టర్ అడిగారని, అనసూయకి సాంగ్ నచ్చింది అని, అలాగే చావు కబురు చల్లగా నిర్మాత బన్నీ వాస్ తో ఉన్న అనుబంధం కారణముగా అనసూయ ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది అనడమే కాదు.. ఆ సాంగ్ కోసం అనసూయకి కేవలం 15 లక్షలు ఇచ్చారని  చెబుతున్నారు. మరి మొన్న 25 అన్నవారు.. ఇప్పడు 15 అని మాట్లాడుతున్నారు. ఇందులో నిజం అనసూయే చెప్పాలమ్మ.

Tags:    

Similar News