అనసూయ అన్నది కరెక్టుగానే ఉంది!!

అనసూయ ఏ విషయాన్నీ  అయినా… నిర్భయంగా చెబుతుంది. నెటిజెన్స్ ఎలా ఉన్న… ఏమనుకున్నా సరే అనసూయ అనుకున్నది అనుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తుంది. తాజాగా అనసూయ [more]

Update: 2020-05-06 05:26 GMT

అనసూయ ఏ విషయాన్నీ  అయినా… నిర్భయంగా చెబుతుంది. నెటిజెన్స్ ఎలా ఉన్న… ఏమనుకున్నా సరే అనసూయ అనుకున్నది అనుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తుంది. తాజాగా అనసూయ మరో హాట్ టాపిక్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వెబ్ మీడియా యుద్ధం ఓ రేంజ్ లో పాకింది. టాలీవుడ్ హీరోలంతా ఒకే తాటిపైన చేరి విజయ్ దేవరకొండ కి మద్దతు తెలుపుతున్నారు. అయితే అనసూయ మాత్రం తనదాకా వస్తేనేకాని నెప్పి తెలియదా అంటూ ట్వీట్ చెయ్యడంపై పెద్ద దుమారం చెలరేగింది.

వెబ్ మీడియా వాళ్ళు రక్తాన్ని పీల్చేస్తున్నారంటూ… ట్వీట్ చెయ్యడం కూడా సంచలనం అయ్యింది. అయితే అనసూయ మాత్రం తనదాకా వస్తేనే నొప్పి తెలియదా అన్నదానికి మాత్రం విజయ్ ఫాన్స్ తో పాటుగా మహేష్ ఫాన్స్ ఆమెని ఆడుకుంటున్నారు. గతంలో అనుసయాకి కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొని ట్విట్టర్ లో పోస్ట్ పెడితే… అందరూ అనసూయని ఆడుకున్నారు. అయినప్పటికీ అనసూయ చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. ప్రస్తుతం విజయ్ కి మద్దతు తెలుపుతున్న హీరోలందరికీ అనసూయ ట్వీట్ సెటైర్ గా కనబడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ ,లాంటి స్టార్ హీరోని ఛానల్స్ లో లైవ్ డిబేట్స్ పెట్టి అందుకున్నప్పుడు, ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన తల్లిని తప్పుగా దూషించినప్పటికీ.. ఒక హీరో కూడా మాట్లాడలేదు. కానీ విజయ్ దేవరకొండ లాంటి హీరో ఓ మాటందుకోగానే… హీరోలంతా ఏకమై ఒకే తాటిపైకి రావడం కరెక్ట్ నా అనేది ఆలోచించాల్సిన విషయమే.

Tags:    

Similar News