రాజకీయ నాయకురాలిగా అనసూయ..!

Update: 2018-11-13 07:33 GMT

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ షూటింగ్ శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో అదరగొడుతున్నాడు. నడక, స్టైల్, పంచెకట్టు అన్ని రాజశేఖర్ రెడ్డిలా మమ్ముట్టి కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే బయటికొచ్చిన యాత్ర స్టిల్స్, యాత్ర టీజర్ అన్నీ సినిమా మీద అంచనాలు పెరిగేలా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ఈ యాత్ర సినిమా బాగా ఉపయోగపడేలా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ నెలాఖరున విడుదల కావాల్సి ఉండగా... లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరికి షిఫ్ట్ అయ్యేలా ఉందనే న్యూస్ వినబడుతుంది.

బయటకు వచ్చిన అనసూయ ఫోటో

విడుదల డేట్ విషయంలో క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో ఇప్పుడు బయటికొచ్చిన ఒక పిక్ మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈ యాత్ర సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఒక కీ రోల్ లో నటిస్తుంది. ప్రస్తుతం అనసూయ, మమ్ముట్టి మీద పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించి లొకేషన్ లోని ఒక పిక్ ను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తాను పోషిస్తున్నది ఏ రాజకీయ నాయకురాలి పాత్ర అనే విషయాన్ని మాత్రం ఆమె రివీల్ చేయలేదు. మరి రంగస్థలంలో రంగమ్మత్తగా ఇరగదీసిన అనసూయ ఎఫ్2లో కీ రోల్ పోషిస్తుంది. అలాగే ఇప్పుడు యాత్రలో ఒక రాజకీయ నాయకురాలిగా అదరగొట్టేయ్యబోతుందనేది ఈ పిక్ ద్వారా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రను జగపతి బాబు, ఇతర కీలక పాత్రల్లో సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ నటిస్తున్నారు.

Similar News