శిరీష్ కి అంత ఎక్కువైందా?

మెగా హీరోలు ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా.. ఏదో ఒక సినిమా హిట్ అవకపోతుందా అని సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇక అల్లు అర్జున్ తమ్ముడు అల్లు [more]

Update: 2019-03-31 12:43 GMT

మెగా హీరోలు ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా.. ఏదో ఒక సినిమా హిట్ అవకపోతుందా అని సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇక అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కాస్త పేరున్న సినిమాల్లో నటించైనా .. ఇంకా స్టార్ రేంజ్ అందుకోలేకపోయాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వత ప్లేస్ కోసం సాయి ధరమ్, తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లాంటి హీరోలు పోటీపడుతూనే ఉన్నారు. తాజాగా అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ మూవీ విడుదల విషయంలో వాయిదాలమీద వాయిదాలు తీసుకుంటుంది. కారణం అల్లు శిరీష్ ఆ సినిమా అన్ని విషయాల్లో వేలుపెడుతున్నాడని.. అందుకే ఆ సినిమా ఇంకా విడుదలకాలేదని… సినిమాల్లో ఓ అన్నంత అనుభవం లేని శిరీష్ టాప్ హీరో లెవల్లో చాలా విషయాల్లో మార్పులు చేర్పులు చేసాడనే టాక్ నడిచింది.

అయితే ఏబీసీడీ సినిమా షూటింగ్ ని ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ విడుదల విషయంలోనే డేట్స్ మీద డేట్స్ మార్చుకుంటూ పోతుంది. తాజాగా ఏబీసీడీ సినిమాని అల్లు అరవింద్ వీక్షించాడని.. అందులో ఏయే సీన్స్ రిపేర్లు చేయించాలనే చర్చల్లో అరవింద్ తో పాటుగా ఏబీసీడీ టీం ఉందని చెబుతున్నారు. మరోపక్క ఎడిటింగ్ విషయంలో అల్లు శిరీష్ కి నిర్మాతకి బేధాభిప్రాయాలొచ్చాయనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఎడిటింగ్ విషయంలో శిరీష్, నిర్మాత ఉప్పు, నిప్పులా వున్నారని ఫిలింనగర్ టాక్. అయితే ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ కొడుకు శిరీష్ ను సపొర్ట్ చేయడం లేదని తెలుస్తోంది. అందుకే సినిమాని విడుదల చేసే విషయమై ఇంత స్తబ్దత నెలకొందంటున్నారు. మరి అరవింద్ చొరవ తీసుకుంటేనే సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. చూద్దాం ఏబీసీడీ పరిస్థితి ఏమిటి అనేది.

Tags:    

Similar News