సక్సెస్ కోసం దుల్కర్ ని నమ్ముకుంటున్నాడా?

Update: 2018-04-24 15:00 GMT

మెగా హీరోల్లో అల్లు శిరీష్ హీరో గా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. డిఫరెంట్ సబ్జక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అల్లు శిరీష్ కి స్టార్ హీరో హోదా రావడానికి ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడడం లేదు. 'కొత్త జంట, ఒక్క క్షణం' హిట్ అయినాయనిపించినా కలెక్షన్స్ మాత్రం లేవు. 'ఒక్క క్షణం' పెద్దగా విజయం సాధించకపోయినా... అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా ఐతే తనకి మార్కెట్ పెరగడం కష్టమని భావించిన అల్లు శిరీష్ ప్రస్తతం మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నమ్ముకుంటున్నాడట.

ఏబీసీడీ సూపర్ హిట్ కావడంతో.....

ఆ మధ్య కాలంలో మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన 'ఏబీసీడీ' సినిమా సూపర్ హిట్ అవడమే కాదు... మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి స్టార్ డం ని కూడా తెచ్చి పెట్టిన సినిమా. అప్పటినుండి దుల్కర్ కి కెరీర్ లో ఎదురులేకుండా పోయింది. ప్రస్తుతం మలయాళంలో ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. అతను ప్రస్తుతం తెలుగులో, తమిళంలో తెరకెక్కిన 'మహానటి'లో జెమిని గణేశన్ పాత్రలో నటించాడు. అయితే ప్రస్తుతం దుల్కర్ 'ఏబీసీడీ' ని నమ్ముకుని అల్లు శిరీష్ ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ధనవంతుడు పేదరికంలోకి వచ్చి.....

'ఏబీసీడీ' లో దుల్కర్ ఒక రిచ్ ఎన్నారై పర్సన్ గా ఇండియాలోకి అడుగుపెట్టి....మరి చాలా సాధారణమైన జీవితాన్ని గడపాలనుకుంటాడు. మరి ఒక రిచ్ పర్సన్ అలా సాధారమైన జీవితాన్ని గడిపే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనే థీమ్ తో ఈ సినిమా తెరకెక్కింది. మరి అదే సినిమాని తెలుగులో అల్లు శిరీష్ ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రీమేక్ చేస్తున్నాడు. ఆ కొత్త దర్శకుడు పేరు సంజీవ్. ఇక సంజీవ్ దర్శకత్వంలో శిరీష్ ఎన్నారై గా ఇండియా కి వచ్చి ఒక సాధారణ యువకుడిగా ఎలా జీవితాన్ని కొనసాగిస్తాడో అనేది ఈ ఏడాది చివరిలో గాని తెలియదు.... ఎందుకంటే ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి .. ఇదే ఏడాది చివరిలో విడుదల చేసే యోచనలో శిరీష్ అండ్ సంజీవ్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Similar News