మెగా హీరో బెదరడం లేదే…!

అవెంజర్స్ కి, మహర్షి సినిమాకి భయపడి మీడియం రేంజ్ సినిమా నిర్మాతలంతా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసేసుకున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రతాపం ఒక వారానికే [more]

Update: 2019-05-13 05:29 GMT

అవెంజర్స్ కి, మహర్షి సినిమాకి భయపడి మీడియం రేంజ్ సినిమా నిర్మాతలంతా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసేసుకున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రతాపం ఒక వారానికే చల్లబడిపోయింది. ఇక తాజాగా మహర్షి సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. అయితే చాలామంది భయపడినట్లుగా మహర్షి సినిమా భారీ సక్సెస్ అయితే కాలేదు. మహర్షి సినిమా మీద ఉన్నంత ఎక్స్ పెక్టేష‌న్స్ సినిమా విడుదలయ్యాక లేవు. మహేష్ బాబు 25వ సినిమాగా భారీ అంచనాలతో విడుదలైన మహర్షి సినిమా ఆ అంచనాలు అందుకోలేకపోయింది. కానీ మహర్షి నిర్మాతలు మాత్రం రోజుకో సక్సెస్ మీట్ పెడుతూ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. మహేష్ ఎప్పుడు తన సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడు. కానీ మహర్షి విషయంలో మాత్రం సక్సెస్ మీట్ కి కూడా హాజరవడం, సినిమా భారీ సక్సెస్ అయినందుకు కాలర్ కూడా ఎగరేస్తున్నాడు.

ధైర్యంగా వ‌చ్చేస్తున్న అల్లు శిరీష్‌

మరి మహర్షి సినిమా విడుదలకు ముందు ఊపు చూసి వెనక్కి తగిన మీడియం హీరోలు ఇప్పుడు మహర్షి టాక్ తో ముందుకొస్తున్నారు. మే 17న సినిమా విడుదలన్న నిఖిల్ అర్జున్ సురవరం మాట ఎలా ఉన్నా అల్లు శిరీష్ మాత్రం తన ఎబిసిడిని ధైర్యంగా విడుదల చేస్తున్నాడు. మొదట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వేలు పెట్టి, పిఆర్ టీం ని మర్చేశాడు అల్లు శిరీష్.. అందుకే ఎబిసిడి అనుకున్న టైంకి విడుదల కావడం లేదంటూ ప్రచారం జరిగింది. ఇక చాలాసార్లు ఏబీసీడీ సినిమా విడుదల డేట్స్ మార్చుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మహర్షి టాక్ చూసి ఎలాంటి బెదురూ లేకుండా అల్లు శిరీష్ మే 17న రావడానికి రెడీ అయ్యాడు. మంచి ప్రమోషన్స్ తో ఏబీసీడీ ని బాక్సాఫీసు వద్దకు దింపుతున్నాడు. మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ అయితే మామూలుగానే తన సినిమా పోస్ట్ పోన్ చేసుకునేవాడే. కానీ ఇప్పుడు మాత్రం అల్లు శిరీష్ ఎంతో కాన్ఫిడెంట్ గా రంగంలోకి దిగుతున్నాడు. ఈరోజు నాని గెస్ట్ గా ఏబీసీడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా జరగబోతుంది.

Tags:    

Similar News