మెగాఫ్యామిలీ పై రూమర్స్ కి చెక్ పెట్టాడు శిరీష్

టాలీవుడ్ లో గత కొంతకాలం మెగా ఫామిలీ గురించి ఓ రూమర్ వైరల్ అవుతుంది. అదే అల్లు అర్జున్ – రామ్ చరణ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని. [more]

Update: 2019-05-19 10:09 GMT

టాలీవుడ్ లో గత కొంతకాలం మెగా ఫామిలీ గురించి ఓ రూమర్ వైరల్ అవుతుంది. అదే అల్లు అర్జున్ – రామ్ చరణ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని. అందుకు తగ్గట్టుగానే వారిద్దరూ సరిగా కలుసుకోకపోవడం లేదని…దానికి తోడు అల్లు అర్జున్ రంగస్థలం గురించి కామెంట్ చేయకపోవడం వంటి అనుమానాలు మరింత బలపడ్డాయి.

మరి ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో మాత్రం ఎవరికి తెలియదు. అయితే దీనిపై తాజాగా అల్లు శిరీష్ వారి మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు హీరోలు రెగ్యులర్‌గా కలుసుకొంటారు. చాలా విషయాలు గురించి మాట్లాడుకుంటుంటారు. సో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల్లో వాస్తవం లేదు.

యూట్యూబ్ వాళ్ళు వ్యూస్ కోసమే ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని..వాటిని మనం పటించుకోవాల్సిన అవసరంలేదని…మెగా హీరోలందరి మధ్య మంచి సఖ్యత, రిలేషన్స్ ఉన్నాయని…అందులో ఎటువంటి డౌట్స్ లేవు అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని..ఆయన పార్టీ గెలవాలని కోరుకుంటున్నాని…అల్లు అర్జున్ కూడా జనసేన పార్టీకి బహిరంగా ఎన్నికల సమయంలో స్వయంగా పాలకొల్లుకు వెళ్లి పవన్, నాగబాబుకి తన సపోర్ట్ తెలిపారని గుర్తుచేశాడు. సో ఇలా తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చాడు శిరీష్.

Tags:    

Similar News