అల వైకుంఠపురములో ఓవర్సీస్ టాక్

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. త్రివిక్రమ్ మాయాజాలం, అల్లు అర్జున్ మ్యానరిజం తో ఈ సినిమాపై భారీ హైప్ ఉంది.సాంగ్స్ తోనూ, టీజర్, [more]

Update: 2020-01-12 04:55 GMT

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. త్రివిక్రమ్ మాయాజాలం, అల్లు అర్జున్ మ్యానరిజం తో ఈ సినిమాపై భారీ హైప్ ఉంది.సాంగ్స్ తోనూ, టీజర్, ట్రైలర్ తోనూ అల్లాడించిన త్రివికం మరియు బన్నీల అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ టాక్ బయటికోచింది. ఇప్పటికే పూర్తయిన ప్రీమియర్స్ తో ఓవర్సీస్ ప్రేక్షకులను ఈ సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ కామెడీ అదుర్స్ అని.. జులాయి తర్వాత అల్లు అర్జున్ ఆ రేంజ్ కామెడీ అలవైకుంఠపురములో సినిమాలో చేసాడని అంటున్నారు. మ్యూజికల్ గా ముందే బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ చిత్రం వాటిని విజువల్ గా చూపించే క్రమంలో కూడా వండర్ చేసిందని… ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.

అయితే సెకండ్‌ హాఫ్‌ విషయంలో మాత్రం త్రివిక్రమ్ కాస్త తడబడ్డాడట. ద్వితీయార్థంలో వావ్‌ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవటం, ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవటం నిరాశకలిగిస్తుందన్న అంశంగా చెబుతున్నారు. మెగాస్టార్ మరియు ఇతర స్టార్ హీరోల సాంగ్స్ కు బన్నీ స్టెప్పులు వేసే ఎపిసోడ్ చూడాలి..ఇది మాత్రం అందరి హీరోల ఫ్యాన్స్ కు పండగే. అయితే కథను పక్కన పెట్టి త్రివిక్రమ్‌ రాసుకున్న సబ్‌ ప్లాట్‌ ఏమంత వర్క్‌ కాలేదంటున్నారు ప్రేక్షకులు. ఇక బన్నీ డాన్స్, మ్యానరిజం కామెడీ అన్ని సినిమాకి హైలెట్ గా ఉన్నాయని, మ్యూజిక్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది అని… ఫ్యామిలీ ఎమోషన్ కూడా వర్కౌట్ అయ్యిందని.. కాకపోతే పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఇద్దరూ కేవలం గ్లామర్‌ షోకు మాత్రమే పరిమితమయ్యారని అంటున్నారు. కథలో కొత్తదనం లేకపోవడం కూడా సినిమా మైనస్ పాయింట్స్ లో ఒకటిగా ఉందనేది ఓవర్సీస్ ప్రేక్షకుల టాక్.

Tags:    

Similar News