హిట్ డైరెక్టర్ ని పట్టేశాడుగా..!

‘నా పేరు సూర్య’ డిజాస్టర్ కావడంతో అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. సరైన స్టోరీ కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు కానీ [more]

Update: 2018-12-25 07:42 GMT

‘నా పేరు సూర్య’ డిజాస్టర్ కావడంతో అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. సరైన స్టోరీ కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు కానీ దేన్నీ ఫైనలైజ్ చేయలేదు. మొన్నటివరకు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడని స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కాదని మరో డైరక్టర్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. ‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ పరశురామ్ కు రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ టాక్. తాజాగా పరశురామ్.. బన్నీ కి ఒక ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ వినిపించాడట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

న్యూ ఇయర్ రోజున ప్రకటన

బన్నీ గతంలో ఇటువంటి కథల్లో నటించినప్పటికీ పరశురామ్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది కాబట్టి ఓకే చేసాడని ఫిలింనగర్ సమాచారం. మరో ఐదు రోజుల్లో అంటే న్యూ ఇయర్ డే నాడు ఈ సినిమాను అధికారంగా ప్రకటించనున్నారని టాక్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తారట. ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు పరశురామ్. చాలా తక్కువ కాలంలోనే ఈ సినిమాను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడట బన్నీ. బన్నీ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయడం పరశురామ్ కి ఇదే మొదటిసారి. మరి త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు..? అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్.

Tags:    

Similar News