మహేష్ బాటలో అల్లు అర్జున్..!

Update: 2018-11-30 07:59 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా అమెరికా షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నాడు మహేష్. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఇలా వరుస సినిమాలు చేస్తూనే వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నాడు. మరోవైపు తన బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడు.

గచ్చిబౌలిలో మహేష్ బాబు థియేటర్స్...

మహేష్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్లతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించాడు. ఈ మల్టీప్లెక్స్ కి 'ఏఎంబి' సినిమాస్ గా నామకరణం కూడా చేశాడు. రోబో 2.ఓ చిత్రంతో స్టార్ట్ అవ్వాల్సిన థియేటర్స్ కొంచెం ఆలస్యంగా ఓపెన్ కానున్నాయి. డిసెంబర్ 2 నుండి ప్రారంభం కానున్నాయట. నేను ఏమైనా తక్కువా అని ఓ స్టార్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అల్లు అర్జున్ కూడా...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మహేష్ లాగా మల్టీప్లెక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దమయ్యాడు. అది కూడా హైదరాబాద్ అమీర్ పేటలో ఉండే సత్యం థియేటర్ ప్లేస్ లో ఓ భారీ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ఆ మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్ - ఏషియన్ సంస్థ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. దీనికి ఏఏఏ అనే పేరును పెట్టనున్నారట. ఏఏఏ అంటే "అల్లు అర్జున్ ఏషియన్" అని అర్ధం. ఆలా ఇద్దరు టాలీవుడ్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగనున్నారు.

Similar News