బన్నీ సరసన పాయల్ కాదా..?

Update: 2018-10-31 08:01 GMT

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో మూడోసారి తెరకెక్కబోతున్న సినిమా ఈ డిసెంబర్ నుండి మొదలు కావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. వీరి కాంబోలో సినిమా ఫైనల్ అయిందనే న్యూస్ తప్ప అధికారిక ప్రకటన మాత్రం లేదు. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్నడూ ఇవ్వని ఇంటర్వూస్ ఇస్తూ కాస్త బిజీగానే ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమాని మాత్రం ఎక్కడ చెప్పలేదు త్రివిక్రమ్. కానీ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కథ మీద కూర్చున్నాడంటున్నారు.

హీరోయిన్ ఎవరో..?

అయితే ఈ సినిమా ఒక హిందీ సినిమాకి రీమేక్ అనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా నిర్మాణంలో నిర్మాతలుగా ఎవరు అనే కన్ ఫ్యూజన్ వల్లనే సినిమా నుండి అధికారిక ప్రకటన రావడానికి ఆలస్యం అంటున్నారు. మరి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని... అందులో భాగంగానే అల్లు అర్జున్ కి కథానాయికని సెట్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఇప్పటికే ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ ఫుట్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశమున్నట్లుగా వార్తలొస్తే.. ఇప్పుడు అల్లు అర్జున్ కి జోడిగా కియారా అద్వానీ పేరు వినబడుతుంది. భరత్ అనే నేనుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా ఆ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ - బోయపాటి సినిమా లో ఛాన్స్ కొట్టేసింది.

వారే క్లారిటీ ఇవ్వాలి...

తాజాగా మరో మెగా హీరో అల్లు అర్జున్ కి కూడా కియారా పేరే వినబడుతుంది. ప్రస్తుతం పాయల్, కియారా అద్వానీల పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. మరి త్రివిక్రమ్ కానీ, బన్నీ కానీ తమ సినిమా మీద ఒక క్లారిటి ఇస్తే గాని.. వారి కాంబోలో మూవీ మీద ఏర్పడిన సస్పెన్స్ తొలిగేలా లేదు. చూద్దాం బన్నీ విక్రమ్ కుమార్ ని హోల్డ్ లో పెట్టినట్లుగా త్రివిక్రమ్ ని అయితే పెట్టాడు కాదా...!

Similar News