అల కి చెక్ పెట్టిన సరిలేరు టీం

సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో సినిమాల జోరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది. మహేష్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ [more]

Update: 2019-12-20 06:07 GMT

సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో సినిమాల జోరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది. మహేష్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ పరంగా అల వైకుంఠపురములో దూసుకుపోతుంటే.. టీజర్ పరంగా సరిలేరు నీకెవ్వరూ టాప్ ప్లేస్ లో ఉంది. అయితే తాజాగా ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని రెండు టీమ్స్ భారీగా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే మహేష్ జనవరి 5 న సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ నగర నడి బొడ్డున ఎల్బీ స్టేడియం లో పెద్ద ఎత్తున ప్లాన్ చేసాడు.

అంతేకాకుండా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ ని గెస్ట్ గా పిలవబోతున్నాడు. మహేష్ ఈసారి రామ్ చరణ్ ని పక్కనబెట్టి మెగాస్టార్ చిరు ని పట్టుకోవడమే కాదు.. మరో స్టార్ హీరో ఎన్టీఆర్ ని లైన్ లో పెట్టాడనే న్యూస్ నడుస్తుంది. ఓవరాల్ గా మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో సరిలేరు ఓపెనింగ్స్ ని భారీగా తెర లేపడానికి మహేష్ భీభత్సంగా ప్లాన్ చేసి.. చిరు అండ్ ఎన్టీఆర్ లను సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ లుగా తీసుకురావడమే కాదు మరోపక్క అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ ని స్పెషల్ గా ఆహ్వానిస్తున్నాడని తెలియగానే.. మహేష్ ముందెళ్ళి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం అనే న్యూస్ ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. మరి అల్లు అర్జున్ అలా కి అలా చెక్ పెట్టిన మహేష్ ఇప్పుడు ప్రమోషన్స్ లో మరింత కొత్తదనానికి రెడీ అవుతున్నాడట. ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చీఫ్ గెస్ట్ పై మెగా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మొదలయ్యింది.

Tags:    

Similar News