అల్లు అర్జున్ మీద మహేష్ కి కోపం వచ్చిందా?

నిన్న సాయంత్రం ఇద్దరు హీరోస్ ఒకరికొకరు పోటాపోటీగా తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రటించారు. సంక్రాంతి సీజన్ కు రెండు భారీ సినిమా లు రిలీజ్ [more]

Update: 2019-10-13 07:10 GMT

నిన్న సాయంత్రం ఇద్దరు హీరోస్ ఒకరికొకరు పోటాపోటీగా తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రటించారు. సంక్రాంతి సీజన్ కు రెండు భారీ సినిమా లు రిలీజ్ అవుతున్నాయి అని అందరికి తెలిసిందే. కానీ ఇద్దరు హీరోస్ ఒకేరోజు వస్తున్నాం అని ప్రకటించారు. ముందుగా అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్ డేట్ ను ప్రకటించాడు.

అల్లు అర్జున్ ప్రకటించిన గంట‌న్న‌ర‌కే మ‌హేష్ బాబు రంగంలోకి దిగిపోయాడు. తన సినిమా అయినా సరిలేరు నీకెవ్వరూ రిలీజ్ డేట్ జనవరి 12 అని ప్రకటించాడు. ఇలా ఇద్దరు ఒకేరోజు వస్తుండడం పెద్ద షాకింగ్. రీసెంట్ గా ఇద్దరు సినిమా నిర్మాతలు సంక్రాంతి సీజన్ లో తమ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో చ‌ర్చ‌లు జరిపిన అవి ఫ‌లితాన్నివ్వ‌ లేద‌ని తాజా ప్ర‌క‌ట‌న‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

తమకు ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌కుండా, డేట్ విష‌యం తేల్చ‌కుండా బ‌న్నీ సినిమా డేట్ ప్ర‌క‌టించేయ‌డంతో మహేష్ కు దిల్ రాజు కు కోపం వచ్చి హ‌డావుడిగా త‌న సినిమాను కూడా అదే తేదీకి రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఆదివారం రిలీజ్ అవ్వడం. సాధారణంగా సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి.

Tags:    

Similar News