మాస్ డైరెక్టర్ తో అల్లు అరవింద్ మూవీ

రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా తీసిన దారుణమైన డిజాస్టర్ ఆడించాడు బోయపాటి శ్రీను. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బోయపాటి తో సినిమా [more]

Update: 2019-07-18 08:00 GMT

రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా తీసిన దారుణమైన డిజాస్టర్ ఆడించాడు బోయపాటి శ్రీను. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బోయపాటి తో సినిమా తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాని పరిస్థితి. దాదాపు ఏడు నెలలు తరువాత నేను ఉన్నానంటూ ఓ స్టార్ నిర్మాత ముందుకు వచ్చారు. ఆయనే అల్లు అరవింద్.

బోయపాటి డైరెక్షన్ లో….

రీసెంట్ గా అయన కార్తికేయ న‌టించిన గుణ 369 ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు వచ్చి.. బోయపాటి తో మా బ్యానర్ లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. అయితే హీరో ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఈ కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సింది కానీ లేట్ అవుతూ వచ్చిందని ఆయన అన్నారు. తమకు బోయపాటి ఓ బ్లాక్ బ‌స్టర్ ఇచ్చిన సంగతి గుర్తు చేసుకుంటూ…మ‌రో హిట్ ఇవ్వబోతున్నాడ‌ని ధీమాగా చెబుతున్నాడు ఈయ‌న‌. మూడేళ్లు కిందట అల్లు అర్జున్ తో బోయపాటి స‌రైనోడు తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

సరైనోడు హిట్ తో….

ఆ చిత్రం అప్పటిలో 70 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం. అయితే ఈసారి కూడా హీరో బన్నీ నా? లేదా వేరే ఎవరన్నన అనేది తెలియాల్సిఉంది. ప్రస్తుతం బోయపాటి బాలయ్య తో ఓ సినిమా చేయున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా? ఉండదా? అనేది ఇంకా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రుగుతుంది

Tags:    

Similar News