మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యలగా విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై [more]

Update: 2019-04-25 11:15 GMT

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యలగా విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ఇవాళ పలు పార్టీల నేతలు అఖిలపక్షంగా ఏర్పడి గవర్నర్ నరసింహన్ కలిసి ఫిర్యాదు చేశారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గవర్నర్ కు వివరించారు. గ్లోబరీనా సంస్థతో పాటు ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలన్నారు.

Tags:    

Similar News