అక్కినేని అభిమానులూ.. కంగారు పడకండి..!

నిన్న సోషల్ మీడియాలో ఒక కామెడీ రూమర్ తెగ ప్రచారంలోకి వచ్చింది. మూడు సినిమాలతో హీరోగా నిలదొక్కుకోలేక అష్టకష్టాలు పడుతున్న అక్కినేని అందగాడు అఖిల్… ఒక డిజాస్టర్ [more]

Update: 2019-01-31 06:27 GMT

నిన్న సోషల్ మీడియాలో ఒక కామెడీ రూమర్ తెగ ప్రచారంలోకి వచ్చింది. మూడు సినిమాలతో హీరోగా నిలదొక్కుకోలేక అష్టకష్టాలు పడుతున్న అక్కినేని అందగాడు అఖిల్… ఒక డిజాస్టర్ డైరెక్టర్ తో తన నాలుగో సినిమాకి కమిట్ అవుతున్నాడనేది ఆ వార్త సారాంశం. ఈలోపు ఆ న్యూస్ చదివిన అక్కినేని అభిమానులకు టెన్షన్ పట్టుకుంది. అఖిల్ పోయి పోయి ఆ డిజాస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్లకు కమిట్ అవడం ఏమిట్రా దేవుడా అంటూ తలలు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు అక్కినేని అభిమానులు కంగారు పడకండి అంటూ.. మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం మిస్టర్ మజ్ను సినిమా ప్రమోషన్స్ లో ఉన్న అఖిల్.. ఆ సినిమా హిట్ కానందుకు కాస్త నిరుత్సాహపడిన మాట వాస్తవమే కానీ.. మిస్టర్ మజ్నుని మరికాస్త ప్రేక్షకుల్లోకి తీసుకెళితే.. పని జరుగుతుంది అనుకుని అఖిల్ మిస్టర్ మజ్ను టీంతో కలిసి కాలేజ్ లు, థియేటర్స్, గుళ్లూగోపురాలు తిరుగుతున్నాడు.

మళ్లీ యంగ్ డైరెక్టర్ తోనే…

ఇకపోతే అఖిల్ నాలుగో సినిమాని మొదలు పెట్టడానికి అయన తండ్రి నాగార్జున కాస్త సమయం తీసుకోమన్నాడని అంటున్నారు. ఈలోపు అఖిల్ నాలుగో డైరెక్టర్ కింద అనేక రకాల డైరెక్టర్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అఖిల్ ఎలాంటి డిజాస్టర్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడం లేదని.. ఆయన నాలుగో సినిమాకి మళ్లీ ఒక యంగ్ డైరెక్టర్ తోనే చేయబోతున్నాడనేది అక్కినేని కాంపౌండ్ చెబుతున్న మాట. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ లేదు కానీ అఖిల్.. వెంకీ అట్లూరి కమిట్ అయినప్పుడు.. అఖిల్ నాలుగో ప్రాజెక్ట్ ని మలుపు డైరెక్టర్ సత్యతో తన నాల్గవ చిత్రాన్ని చేయనున్నాడని.. ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా రేపు మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం.

Tags:    

Similar News